టీడీపీకి షాక్ : టీఆర్ఎస్‌లో చేరిన మండవ వెంకటేశ్వరరావు

హైదరాబాద్ : మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. శనివారం (ఏప్రిల్ 6, 2019) సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 11:23 AM IST
టీడీపీకి షాక్ : టీఆర్ఎస్‌లో చేరిన మండవ వెంకటేశ్వరరావు

హైదరాబాద్ : మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. శనివారం (ఏప్రిల్ 6, 2019) సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

హైదరాబాద్ : మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. శనివారం (ఏప్రిల్ 6, 2019) సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మండవతో పాటు కాంగ్రెస్ నేత గాయత్రి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి సీనియర్ నాయకులు సైతం దూరం అవుతున్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌ గూటికి చేరడం టీడీపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది.

నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన మండవ వెంకటేశ్వరరావు.. కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందుగానే టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్‌కుమార్‌‌లు మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా మండవ ఇంటికి వెళ్లి సపోర్ట్ చేయాలని కోరడం తెలిసిందే. తెలంగాణలో టీడీపీ పోటీ చేయని పరిస్థితిలో టీడీపీ ఓటు బ్యాంకే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. ఆ పార్టీ ముఖ్య నేతలను ఆకర్షించడం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలని భావిస్తున్నారు. మండవను పార్టీలోకి చేర్చుకోవడం ఇందులో భాగమే అంటున్నారు.

టీఆర్ఎస్ లోకి వలసల కారణంగా టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ స్వయంగా మండవ వెంకటేశ్వరరావు ఇంటికెళ్లి మాట్లాడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీచేయని నేపథ్యంలో కేసీఆర్, మండవ మద్దతు కోరారు. అయితే, మండవ ఏకంగా గులాబీ కండువా కప్పుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.