మౌనిక చనిపోయిన మరుసటి రోజే : మెట్రో కాంట్రవర్సీ ట్వీట్

హైదరాబాద్ మెట్రో రైల్‌ డిపార్ట్‌మెంట్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదాస్పదమైంది. మెట్రో స్టేషన్లలో ఛాయ్ తాగి.. అనుభూతిని కూడా పొందండి అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు

  • Published By: veegamteam ,Published On : September 24, 2019 / 03:54 PM IST
మౌనిక చనిపోయిన మరుసటి రోజే : మెట్రో కాంట్రవర్సీ ట్వీట్

హైదరాబాద్ మెట్రో రైల్‌ డిపార్ట్‌మెంట్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదాస్పదమైంది. మెట్రో స్టేషన్లలో ఛాయ్ తాగి.. అనుభూతిని కూడా పొందండి అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు

హైదరాబాద్ మెట్రో రైల్‌ డిపార్ట్‌మెంట్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదాస్పదమైంది. మెట్రో స్టేషన్లలో ఛాయ్ తాగి.. అనుభూతిని కూడా పొందండి అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అమీర్ పేట మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడిపడి మౌనిక చనిపోయి రోజు గడవకముందే.. ఈ ట్వీట్లు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోతుంటే.. ఈ స్నాక్స్ గొడవ ఏంటి అంటూ మరో నెటిజన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

ఆదివారం(సెప్టెంబర్ 22,2019) అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులూడి పడి మౌనికి మృతి చెందింది. ఈ ఘటన సంచలనం రేపింది. మెట్రో స్టేషన్లలో నిర్మాణాల నాణ్యతా ప్రమాణాలపై సందేహాలు నెలకొన్నాయి. మెట్రోలో ప్రయాణం చేయాలంటేనే నగరవాసులు భయపడే పరిస్థితి వచ్చింది. మెట్రో నిర్మాణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మౌనిక చనిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులను ఆదేశించింది. మౌనిక మృతి తీవ్ర విషాదం నింపింది. ఇంకా ఆ ఘటన నుంచి బయటపడలేదు. ఇంతలో అసందర్భంగా మెట్రో రైల్ డిపార్ట్ మెంట్ చేసిన ట్వీట్ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. అసలు సెన్స్ ఉందా అని మండిపడ్డారు.