ఉమెన్ డే..తెలంగాణ ప్రభుత్వం అవార్డులు : 10tv జర్నలిస్టుకు అవార్డు

  • Published By: madhu ,Published On : March 6, 2019 / 03:42 PM IST
ఉమెన్ డే..తెలంగాణ ప్రభుత్వం అవార్డులు : 10tv జర్నలిస్టుకు అవార్డు

మార్చి 08…అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ రోజున దేశంలో అనేక కార్యక్రమాలు జరుగనున్నాయి. పలు రాష్ట్రాలు మహిళలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఇక వివిధ కంపెనీల సంగతి చెప్పనవసరం లేదు. పలు ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. మార్చి 08వ తేదీన సెలవు దినంగా ప్రకటించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురికి అవార్డులు ప్రకటించింది. 
14 రంగాల్లో 21 మంది మహిళలకు అవార్డులు వచ్చాయి. సాహిత్యంలో రావి ప్రేమలత, తస్లీమ్ జౌహర్, సంగీతంలో కీర్తిరాణి, నాట్నంలో రత్నశ్రీ, పెయింటింగ్‌లో ప్రొ.గీత, స్పోర్ట్స్‌లో మిథాలీ రాజ్‌కు అవార్డులు రాగా ఎలక్ట్రానిక్ మీడియాలో 10tv జర్నలిస్టు రచన ముడుంబికి అవార్డు దక్కింది.