తెలంగాణ గవర్నర్కు ఎక్స్ట్రా పవర్స్.. పుదుచ్చేరిలో కూడా
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అదనపు బాధ్యతలు అందుకోనున్నారు. ప్రస్తుతం పుదుచ్చేరికి గవర్నర్ గా కొనసాగుతున్న కిరణ్ బేడీని ఆ పదవి నుంచి తొలగించడంతో అక్కడి పాలనా బాధ్యతలు తమిళిసైకి ఇవ్వనున్నారు. ఈ మేర పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఛార్జి తీసుకోనున్నారు.
కిరణ్ భేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా 2016 మే 22న అపాయింట్ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రాంతంలో కాంగ్రెస్, డీఎంకే మిత్రపక్షం అధికారంలోకి వచ్చిన మూడు రోజులకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు దాదాపు రెండేళ్ల పాటు ఆ పదవి ఖాళీగానే ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.
అప్పుడు కాంగ్రెస్ 15, డీఎంకే 2 సీట్లు గెలిచాయి. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కిరణ్ బేడీ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన తర్వాత అక్కడ సీఎం వి.నారాయణస్వామితో తీవ్ర విబేధాలు వచ్చాయి. ఓ దశలో సాక్షాత్తూ సీఎం నారాయణస్వామి రాజ్భవన్ ముందు ధర్నా కూడా చేశారు.
Dr. Kiran Bedi removed as the Lieutenant Governor of Puducherry
Dr. Tamilisai Soundararajan, Governor of Telangana, given additional charge as Lieutenant Governor of Puducherry pic.twitter.com/pSOoIgcCJK
— ANI (@ANI) February 16, 2021