Mukarram Jah Dies In Turkey: 8వ నిజాం నవాబ్ ముకర్రం జా కన్నుమూత.. రేపు హైదరాబాద్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
మీర్ బర్కత్ అలీ ఖాన్ కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ లోనే నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు మిర్ బర్కత్ అలీ ఖాన్ పార్థివదేహంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకోనున్నారు. ‘‘హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం మిర్ బర్కత్ అలీ ఖాన్ పార్థివదేహాన్ని చౌమహల్లా ప్యాలెస్ కు తరలిస్తాం. సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాక.. అసఫ్ జాహి కుటుంబ సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తాం’’ అని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.
Mukarram Jah Dies In Turkey: హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జా బహదూర్ (89) కన్ను మూశారని ఆయన ఆఫీసు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. 1933లో జన్మించిన మిర్ బర్కత్ అలీ ఖాన్.. కుటుంబంతో సహా టర్కీలో నివాసం ఉంటున్నారు. ఇస్తాంబుల్ లో ఆయన మొన్న రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు మిర్ బర్కత్ అలీ ఖాన్ మనవడు.
మిర్ బర్కత్ అలీ ఖాన్ కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ లోనే నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు మిర్ బర్కత్ అలీ ఖాన్ పార్థివదేహంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకోనున్నారు. ‘‘హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం మిర్ బర్కత్ అలీ ఖాన్ పార్థివదేహాన్ని చౌమహల్లా ప్యాలెస్ కు తరలిస్తాం. సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాక.. అసఫ్ జాహి కుటుంబ సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తాం’’ అని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.
ఇందుకు సంబంధించిన వివరాల షెడ్యూల్, ఇందుకు హాజరయ్యే వారు ఎవరు? వంటి పూర్తి వివరాలను మరి కొన్ని గంటల్లో వివరించే అవకాశం ఉంది. మిర్ బర్కత్ అలీ ఖాన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూలి తెలిపారని సీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. నిజాం వారసుడిగా మిర్ బర్కత్ అలీ ఖాన్ పేదప్రజలకు చేసిన సేవతో పాటు విద్య, వైద్య రంగాలకు అందించిన సాయం గొప్పదని, ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కేసీఆర్ ఆదేశించారని సీఎంవో తెలిపింది.
CM Sri KCR expressed condolences on the demise of Mukarram Jah, grandson of the last Nizam of Hyderabad, Mir Osman Ali Khan Bahadur and son of Azam Jah (the Nizam’s eldest son) and Durre Shehwar couple. Hon’ble CM conveyed his deepest sympathies to the bereaved family members.
— Telangana CMO (@TelanganaCMO) January 15, 2023
హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ గారి మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ ఝా (Mukarram Jah) మరణం పట్ల సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) January 15, 2023
Politics On Master Plan: మాస్టర్ ప్లాన్ వ్యవహారంపై రాజకీయ రగడ