COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,112 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 2,112 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 3,102 మంది కోలుకున్నట్లు చెప్పింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,87,748గా ఉన్నాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉన్నట్లు తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 0.97 శాతంగా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం కరోనాకు ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 24,043 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వివరించింది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,112 కరోనా కేసులు నమోదు

COVID-19 cases in India

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,112 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 3,102 మంది కోలుకున్నట్లు చెప్పింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,87,748గా ఉన్నాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉన్నట్లు తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 0.97 శాతంగా ఉన్నట్లు చెప్పింది.

ప్రస్తుతం కరోనాకు ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 24,043 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వివరించింది. కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 98.76 శాతం ఉన్నట్లు చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 219.53 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. వాటిలో రెండో డోసులు 95 కోట్లు, బూస్టర్ డోసులు 22.01 కోట్లు ఉన్నట్లు వివరించింది.

నిన్న దేశంలో 2,90,752 డోసుల కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 89.98 కోట్ల కరోనా పరీక్షలు చేశారని పేర్కొంది. నిన్న 2,09,088 పరీక్షలు చేసినట్లు తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..