Seema,Sachin love story : సీమా, సచిన్ ప్రేమ కథపై సహస్ర సీమాబల్, యూపీ ఏటీఎస్ ఆరా
పాక్ మహిళ సీమా హైదర్, భారత యువకుడు సచిన్ల ప్రేమ కథ బాగోతంపై సహస్ర సీమాబల్, ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆరా తీస్తోంది. పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్, ఆమె ప్రేమికుడు సచిన్, అతని తండ్రిని ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నోయిడాలోని ఒక అజ్ఞాత ప్రదేశంలో ఆరు గంటల పాటు ప్రశ్నించింది....
![Seema,Sachin love story : సీమా, సచిన్ ప్రేమ కథపై సహస్ర సీమాబల్, యూపీ ఏటీఎస్ ఆరా Seema,Sachin love story : సీమా, సచిన్ ప్రేమ కథపై సహస్ర సీమాబల్, యూపీ ఏటీఎస్ ఆరా](https://10tv.in/wp-content/uploads/2023/07/SeemaSachin-love-story.gif)
Seema,Sachin love story
Seema,Sachin love story : పాక్ మహిళ సీమా హైదర్, భారత యువకుడు సచిన్ల ప్రేమ కథ బాగోతంపై సహస్ర సీమాబల్, ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఆరా తీస్తోంది. పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్, ఆమె ప్రేమికుడు సచిన్, అతని తండ్రిని ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నోయిడాలోని ఒక అజ్ఞాత ప్రదేశంలో ఆరు గంటల పాటు ప్రశ్నించింది. (UP cops) ఈ ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ లభించిన రోజుల తర్వాత ఇది జరిగింది. (Paks Seema Haider, lover questioned)
కోర్టు విధించిన షరతుల ప్రకారం సీమా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా భారతదేశం విడిచి వెళ్లకుండా నిషేధించింది. ఆమె తన ప్రస్తుత చిరునామాను మార్చినట్లయితే కోర్టుకు తెలియజేయాలని కూడా కోరింది. పబ్ జి మొబైల్ గేమ్ ద్వారా పరిచయమైన సీమా భర్తను వదిలి తన నలుగురు పిల్లలతో కలిసి సచిన్ వద్దకు వచ్చింది. పాక్ జాతీయురాలైన సీమా హైదర్ భారతదేశం విడిచి వెళ్లాలని గో రక్ష హిందూ దళ్ అల్టిమేటం జారీ చేసింది.
US H-1B visa : యూఎస్ హెచ్-1బి వీసాదారులకు శుభవార్త
సీమా హైదర్ పాకిస్థాన్ గూఢచారి కావచ్చని, ఆమె వల్ల మన దేశానికి ముప్పు వాటిల్లుతుందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు వేద్ నగర్ వీడియోను విడుదల చేశారు. విద్రోహ దేశానికి చెందిన స్త్రీని మేం సహించం. 72 గంటల్లో సీమా హైదర్ దేశం విడిచి వెళ్లకపోతే ఆందోళన ప్రారంభిస్తామని నగర్ వీడియోలో పేర్కొన్నారు. తనను భారతదేశంలో ఉండటానికి అనుమతించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు సీమా హైదర్ విజ్ఞప్తి చేసింది.
Yamuna continues to rise : యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది…
‘‘దయచేసి నన్ను సచిన్తో కలిసి భారత్లో ఉండనివ్వండి. మీరు నన్ను తిరిగి పాకిస్థాన్కు పంపితే, వారు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. నేను పాకిస్థాన్కు తిరిగి వెళ్లడం కంటే ఇక్కడే చనిపోతాను’’ అని సీమా యూపీ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. కాగా సీమా భర్త గులాం హైదర్ తన భార్య, పిల్లలను ఇంటికి పంపాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. పబ్ జి ద్వారా భారత్కు వచ్చేలా తన భార్యను ప్రలోభపెట్టి మోసగించారని ఓ వీడియోలో గులాం ఆరోపించారు. మరోవైపు సీమా పాకిస్థాన్కు తిరిగి రావడం తమకు ఇష్టం లేదని పాకిస్థాన్ దేశంలోని ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.