Sanjay Raut: సంజయ్ రౌత్ ఈడీ కస్టడీ పొడిగింపు
పాత్రా చాల్ (గృహ సముదాయం) కుంభకోణానికి సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీని పొడిగిస్తూ ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8 వరకు ఈడీ కస్టడీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. పాత్రా చాల్ కేసులో ఈడీ సమర్థంగా కీలక వివరాలు రాబట్టిందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొనడం గమనార్హం. సంజయ్ రౌత్ను ఈడీ కస్టడీ నేటితో ముగుస్తుండడంతో కోర్టు దాన్ని పొడిగించింది.
Sanjay Raut: పాత్రా చాల్ (గృహ సముదాయం) కుంభకోణానికి సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీని పొడిగిస్తూ ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8 వరకు ఈడీ కస్టడీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. పాత్రా చాల్ కేసులో ఈడీ సమర్థంగా కీలక వివరాలు రాబట్టిందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొనడం గమనార్హం. సంజయ్ రౌత్ను ఈడీ కస్టడీ నేటితో ముగుస్తుండడంతో కోర్టు దాన్ని పొడిగించింది.
కాగా, ఇటీవలే ముంబైలోని సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూపని నగదును గుర్తించి, స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందే సంజయ్ రౌత్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీలకు వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తోన్న వేళ సంజయ్ రౌత్ను ఈడీ విచారిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సంజయ్ రౌత్ నుంచి ఈడీ అధికారులు కీలక వివరాలు రాబట్టి కోర్టుకు సమర్పించారు. పాత్రా చాల్ భూ కుంభకోణం (రూ.1,000 కోట్లు)కు సంబంధించి ఇప్పటికే సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్ను ఈడీ అదుపులోకి తీసుకుంది.
China: తైవాన్ విషయంలో ఉద్రిక్తతల వేళ చైనాకు అమెరికా వార్నింగ్