Viral Video: శరీరాలపై పెట్రోల్ పోసుకుని.. నిప్పు అంటించుకుంటుండగా దంపతులను కాపాడిన అధికారులు

శరీరాలపై పెట్రోల్ పోసుకున్న దంపతులు నిప్పు అంటించుకుకే క్రమంలో.. అగ్గి పుల్ల వెలిగించేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అధికారులు కాపాడారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఆర్కే పురంలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తోన్న మునిసిపల్ అధికారులు అందులో భాగంగా ఓ ఇంటికి వెళ్లి దాన్ని కూల్చేయడానికి ప్రయత్నించారు. బుల్డోజర్లను సిద్ధంగా పెట్టుకున్నారు. దీంతో ఆ ఇంట్లోని దంపతులు బయటకు వచ్చి తమ ఇంటిని కూల్చొద్దని, కూల్చితే చచ్చిపోతామని బెదిరించారు. అయినా, అధికారులు వినిపించుకోకుండా తమ పని కొనసాగించారు. దీంతో ఇంటి బయట గోడ వద్ద ఉన్న ఆ దంపతులు శరీరాలపై పెట్రోల్ పోసుకున్నారు.

Viral Video: శరీరాలపై పెట్రోల్ పోసుకుని.. నిప్పు అంటించుకుంటుండగా దంపతులను కాపాడిన అధికారులు

Viral Video: శరీరాలపై పెట్రోల్ పోసుకున్న దంపతులు నిప్పు అంటించుకునేందుకు అగ్గి పుల్ల వెలిగించేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అధికారులు కాపాడారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఆర్కే పురంలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తోన్న మునిసిపల్ అధికారులు అందులో భాగంగా ఓ ఇంటికి వెళ్లి దాన్ని కూల్చేయడానికి ప్రయత్నించారు. బుల్డోజర్లను సిద్ధంగా పెట్టుకున్నారు.

దీంతో ఆ ఇంట్లోని దంపతులు బయటకు వచ్చి తమ ఇంటిని కూల్చొద్దని, కూల్చితే చచ్చిపోతామని బెదిరించారు. అయినా, అధికారులు వినిపించుకోకుండా తమ పని కొనసాగించారు. దీంతో ఇంటి బయట గోడ వద్ద ఉన్న ఆ దంపతులు శరీరాలపై పెట్రోల్ పోసుకున్నారు. అయినప్పటికీ అధికారులు ఇంట్లోకి కొంత భాగాన్ని కూల్చేస్తుండడంతో అగ్గి పుల్ల గీరి ఆ ఇంటి యజమాని భార్య నిప్పంటించుకోబోయింది. దీంతో ఆ దంపతులపై అధికారులు, సిబ్బంది నీళ్లు కుమ్మరించారు.

ఆర్కే పురంలోని అక్రమ కట్టడాలను కూల్చి వేయడానికి అధికారులు పోలీసులు, అగ్ని మాపక సిబ్బందితో కలిసి వచ్చారు. అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఆ దంపతులపై నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది. ఆ దంపతుల పేర్లు సోనా సేన్, సునీల్ సింగ్. ఇటీవల కురిసిన వర్షాలకు బెంగళూరు నీట మునిగిన విషయం తెలిసిందే. దీంతో నీళ్లు నిల్వ ఉంటోన్న ప్రాంతాల్లో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..