South Africa: దక్షిణాఫ్రికాలో దారుణం.. బోక్స్బర్గ్లో 10మంది మృతి.. భయంకరమైన వీడియో
దక్షిణాఫ్రికాలోని బోక్స్బర్గ్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాధ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది.
South Africa: దక్షిణాఫ్రికాలోని బోక్స్బర్గ్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాధ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఎల్పీ గ్యాస్ ట్యాంకర్ క్యూఆర్ టోంబో ఆసుపత్రి ముందు రోడ్డుపై వెళ్తుంది. ఈ క్రమంలో ట్యాంకర్ వంతెనను బలంగా ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు తీవ్రతతో ఆ ప్రాంతంమొత్తం భయానక వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన భయంకరమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పేలుడు దాటికి సమీపంలోని ఆస్పత్రిలోని ఓ భాగం మంటలు వ్యాపించడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలోని రహదారిపై ప్రయాణిస్తున్న కార్లు మంటలు అంటుకొని దగ్దమయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
BREAKING: Multiple killed, injured after truck carrying LP gas explodes in Boksburg, South Africa; nearby hospital on fire – The Citizen pic.twitter.com/4dN35sPREC
— BNO News (@BNONews) December 24, 2022
భారీ పేలుడు కావడంతో ఆ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదరుగా పడిఉన్నాయని, తీవ్రగాయాలతో ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారనే విషయంపై పూర్తిస్థాయిలో స్పష్టం లేదని, 10 మందికంటే ఎక్కువగానే ప్రమాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్డుపై అనేక కార్లు మంటల్లో చిక్కుకోవటంతో ఆ ప్రాంతం అంతా పొగతో కమ్ముకుపోయింది.
UPDATE: At least 10 dead, 27 injured in South Africa gas tanker explosion https://t.co/CgVuNNCez5
— BNO News (@BNONews) December 24, 2022
ఘటన స్థలికి అగ్నిమాపక సిబ్బంది సహా పలు రెస్క్యూ బృందాలు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భారీ పేలుడు దాటికి దాదాపు 10 మంది మరణించారని తెలిపారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఆస్పత్రి ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్ పేలడంతో ఆస్పత్రిలోని పలువురు మరణించగా, పలువురికి గాయాలైనట్లు తెలిసింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.