COVID Surges : కరోనా ఉధృతి.. లాక్ డౌన్‌‌లో 3 కోట్ల మంది

జీరో కొవిడ్‌ స్ట్రాటజీతో.. కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తూ జనాలను ఇళ్లకే కట్టడి చేస్తూ వస్తోంది. అయినప్పటికీ లాభం లేకుండా పోతోంది. వింటర్‌ ఒలింపిక్స్‌ ముగిశాక.. ఆంక్షల సడలింపులతో...

COVID Surges : కరోనా ఉధృతి.. లాక్ డౌన్‌‌లో 3 కోట్ల మంది

China

China Orders Lockdown : కరోనా పుట్టినిల్లు చైనా.. మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. పలు ప్రాంతాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో చైనా కఠిన ఆంక్షలకు దిగింది. మధ్య చైనా సహా షాంఘై చుట్టుప్రక్కల ప్రాంతాలతో పాటు.. పారిశ్రామిక నగరమైన చాంగ్‌చున్‌లో కరోనా కొత్త కేసులు భారీగా పెరగడంతో.. చర్యలకు దిగింది చైనా. దీంతో 3 కోట్ల మంది లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున.. మునుపెన్నడూ లేని పరిస్థితిని డ్రాగన్‌ కంట్రీ ఎదుర్కొంటోంది. ఒక్కరోజులో 5 వేల 280 కేసులు నమోదయ్యాయి. ముందురోజుతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో కేసులు రావడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తున్నది. 2019లో వుహాన్‌లో కేసులు వెలుగు చూసినప్పటి నుంచి.. ఇప్పటిదాకా చైనాలో ఈ రేంజ్‌ కేసులు రావడం ఇదే మొదటిసారి.

Read More : China Covid 4th Wave : చైనాలో కరోనా విజృంభణ.. 2ఏళ్ల రికార్డు బ్రేక్.. ఒక్కరోజే భారీగా కేసులు

ఇప్పుడు కూడా జీరో కొవిడ్‌ స్ట్రాటజీతో.. కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తూ జనాలను ఇళ్లకే కట్టడి చేస్తూ వస్తోంది. అయినప్పటికీ లాభం లేకుండా పోతోంది. వింటర్‌ ఒలింపిక్స్‌ ముగిశాక.. ఆంక్షల సడలింపులతో జనసంచారం ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ ఒక్కసారిగా విజృంభిస్తోంది. కేసులు పెరిగిపోతుండడంతో.. 11 ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్నారు. దాదాపు కోటిన్నర జనాభా ఉన్న టెక్‌హబ్‌ షెంజెన్‌లో బయట మనిషి కనిపించడం లేదు. మరోవైపు లాక్‌డౌన్‌ వల్ల  ఆర్థికంగానూ ప్రభావం పడుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. అక్కడా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. బీజింగ్‌, షాంగై విమానశ్రయాలకు భారీగా విమానాలు రద్దయ్యాయి. షాంగైలోనూ లాక్‌డౌన్‌ కఠినంగా అమలు అవుతోంది. ఇంత జరుగుతున్నా మరణాలు ఎన్ని సంభవిస్తున్నాయనేది మాత్రం చైనా చెప్పడం లేదు.