కరోనా వైరస్ భయంతో కరోనాపై చర్చించే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 10:34 AM IST
కరోనా వైరస్ భయంతో కరోనాపై చర్చించే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్

కరోనా వైరస్ కారణంగా కరోనా వైరస్ గురించి జరగాల్సిన సమావేశం క్యాన్సిల్ అయ్యింది. అమెరికాలోని న్యూయార్క్ లోను..వాషింగ్టన్ లోను  ‘‘డూనింగ్ బిజినెస్ అండర్ కరోనా వైరస్’’పేరుతో  బుధవారం (మార్చి 11) నుంచి ఏప్రిల్ 3వరకూ జరగాల్సిన కరోనాపై చర్చయించేందుకు నిర్ణయించిన రౌండ్ టేబుల్ సమావేశం కాన్సిల్ అయ్యింది. 

ప్రతీ సంవత్సరం న్యూయార్క్ లో ఆటో షోను సహా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీంట్లో భాగంగానే ఈ షోలో కరోనా వైరస్ పై చర్చించేందుకు ఓ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలనుకున్నారు.

కానీ నగరంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో అంతమందీ ఒకేచోట సమావేశమైతే కరోనా ప్రభావం అందిరిపైనా పడుతుందనే భయంతో సమావేశాన్ని రద్దు చేసినట్లుగా మీడియా సమావేశంలో  కాన్సిల్ఆన్ ఫారిన్ రిలేషన్స్ నిర్వాహకులు తెలిపారు. 

See Also | కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన డీకే శివకుమార్