Covid Pill : కరోనా ట్యాబ్లెట్ వచ్చేసింది

కరోనా ట్రీట్మెంట్ కోసం తొలిసారిగా ట్యాబెట్(పిల్) అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ 'మెర్క్'..."మోల్నుపిరవిర్" పేరుతో తయారు చేసిన ఈ ట్యాబెట్ ను

Covid Pill : కరోనా ట్యాబ్లెట్ వచ్చేసింది

Covid Pill

Pill To Treat Covid  కరోనా ట్రీట్మెంట్ కోసం తొలిసారిగా ట్యాబెట్(పిల్) అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ ‘మెర్క్’…”మోల్నుపిరవిర్” పేరుతో తయారు చేసిన ఈ ట్యాబెట్ ను కరోనా బాధితుల కోసం వినియోగించడానికి బ్రిటన్ ప్రభుత్వం గురువారం అనుమతి ఇచ్చింది. ఈ ట్యాబ్లెట్.. కరోనాపై సమర్థంగా పోరాడుతోందని తేలినట్లు బ్రిటన్ మెడిసిన్ రెగ్యులేటరీ తెలిపింది.

కొవిడ్ బారిన పడ్డ వయోజనుల కోసం ఈ ట్యాబ్లెట్స్ ను వినియోగించవచ్చు. అయితే కరోనా రిస్క్ ఫ్యాక్టర్​లలో ఏదో ఒకటి బాధితులకు ఉంటేనే వీటిని తీసుకోవాలని యూకే నియంత్రణ సంస్థ సూచించింది. ఐదు రోజుల పాటు రోజుకు రెండు సార్లు ఈ ట్యాబెట్ ను తీసుకోవాల్సి ఉంటుంది.

బ్రిటన్ హెల్త్ సెక్రటరీ సాజిద్ జావిద్ మాట్లాడుతూ…”ఫ్లూ జ్వరాన్ని ట్రీట్ చేయడానికి వాడే ఈ గోలీ మందును …కొవిడ్ పేషెంట్లకు ఇచ్చి క్లినికల్ ట్రయల్స్ లో విజయవంతమైన ఫలితాలు సాధించారు. ఈ ట్యాబ్లెట్ వేసుకున్న కోవిడ్ పేషెంట్లలోఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు సగం వరకు తగ్గాయి. ప్రాణాలు పోయేంత రిస్క్ నుంచి ఈ ట్యాబ్లెట్ బయటపడేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇది గేమ్ చేంజర్ లాంటి ట్రీట్ మెంట్”అని తెలిపారు. మోల్నుపిరవిర్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా సాధారణంగా ఉన్నట్లు నిపుణులు తెలిపారు. కొవిడ్‌ చికిత్సలో వినియోగిస్తున్న ఇంజెక్షన్‌ రూపంలో ఉన్న మందుల కంటే మాత్రల రూపంలో ఉన్న ఈ ఔషధం బాధితులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.

మరోవైపు, అమెరికా సహా పలు దేశాల్లో మోల్నుపిరవిర్ దరఖాస్తు పెండింగ్​లో ఉంది. దీనికి అనుమతులు లభించకముందే చాలా వరకు దేశాలు మాత్రల కోసం ముందస్తు ఆర్డర్లు ఇచ్చేశాయి.

ALSO READ చోరీకి ముందు అమ్మవారికి మొక్కిన దొంగ _ Khammam District