Jaishankar In Saudi: సౌది అరేబియా రాజుతో సమావేశమైన విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్

రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌది అరేబియాకు జయశంకర్ వెళ్లారు. కాగా, శనివారం ఆయన సౌదీలోని భారత సంతతి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వేంగా వృద్ధి చెందుతుందని, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనే ఆశాభావం తమకుందని ఈ సందర్భంగా జయశంకర్ అన్నారు.

Jaishankar In Saudi: సౌది అరేబియా రాజుతో సమావేశమైన విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్

Jaishankar calls upon Saudi Arabian Crown Prince Mohammed bin Salman in Jeddah

Jaishankar In Saudi: సౌది అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‭తో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్ సమావేశమయ్యారు. జెడ్డా నగరం వీరి సమావేశానికి వేదికైంది. ఇండియా, సౌది అరేబియా దేశాల మధ్య దౌత్య సంబంధాల గురించి సౌది రాజుతో మాట్లాడినట్లు జయశంకర్ తెలిపారు. ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘గౌరవనీయమైన హెచ్ఆర్‭హెచ్ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‭ను జెడ్డాలో కలుసుకోవడం చాలా సంతోషకరం. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ఆయనకు వివరించాను. ఈ విషయమై తన అభిప్రాయాల్ని పంచుకున్నందుకు ఆయనకు కృతజ్ణతలు’’ అని ట్వీట్ చేశారు.

దీనికి సౌది అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‭ను జయశంకర్ కలుసుకున్నారు. ఇండియా-సౌది అరేబియా భాగస్వామ్యం, దౌత్యంపై వీరు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన రాజకీయ, భద్రత, సాంగీక, సాంస్కృతిక కమిటీలు సమావేశమయ్యాయి. ‘‘సౌది అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‭తో మంచి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరు దేశాల రాజకీయ, భద్రత, సాంగీక, సాంస్కృతిక కమిటీలు సమావేశమయ్యాయి’’ అని జయశంకర్ ట్వీట్ చేశారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌది అరేబియాకు జయశంకర్ వెళ్లారు. కాగా, శనివారం ఆయన సౌదీలోని భారత సంతతి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వేంగా వృద్ధి చెందుతుందని, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనే ఆశాభావం తమకుందని ఈ సందర్భంగా జయశంకర్ అన్నారు.

YSR Kalyanamastu : కచ్చితంగా పదో తరగతి పాసవ్వాలి.. కల్యాణమస్తు పథకంపై మంత్రి బొత్స క్లారిటీ