మాలిలో ఉగ్రవాదుల ఘాతుకం: 21 మంది సైనికులు మృతి

బమాకో : మాలిలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. సెంట్రల్ మాలిలోని దియౌరాలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రదాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 21 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 17 ఆదివారం కార్లు, బైకులపై వచ్చిన ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు..ఈ కాల్పుల్లో 21 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు సైనిక వర్గాలు దృవీకరించాయి.
Read Also : నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు
ఈ దాడిపై మాలి అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకార్ స్పందించారు. ఇలాంటి సమయాల్లో దేశ ప్రజలంతా ఏకమై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఇబ్రహీం బౌబకార్ కీట పిలుపునిచ్చారు.ఈ దాడితో మాలిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశం అయిన “రిపబ్లిక్ ఆఫ్ మాలి”గా పిలువబడుతోంది. వైశాల్యపరంగా మాలి ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా ఉంది.
2016లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మందిసైనికులు మరణించగా..గత ఏడాది అంటే 2018లో జరిపిన ఉగ్రదాడిలో ఏకంగా 40మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా మాలిపై జరుగుతున్న ఉగ్రదాడిలో సైనికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాగా.2015లో మాలి రాజధాని బమాకో నగరం మధ్యనున్న రాడిసన్ బ్లూ హోటల్ ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన ఘటనలో 18మందిని బలితీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు..వ్యాపారవేత్తలు బస చేసే ఈ హొటల్ పై జరిగిన దాడిలో 18మంది ఫ్రెంచ్ పౌరులు మరణించిన విషయం తెలిసిందే.
Read Also : ఆఫ్రికా దేశాల్లో ‘ఇడాయ్’ తుఫాన్…140 మంది మృతి
- Terrorist Encounter: ఆ ముగ్గురు ఉగ్రవాదులు జైషే ఈ మహ్మద్ సంస్థకు చెందిన వారు
- Avijit Roy Murder : బంగ్లాదేశ్లో హత్య..ఆ దోషుల్ని పట్టిస్తే రూ.37 కోట్లు బహుమతి ప్రకటించిన అమెరికా
- Mali Terror Attack: బస్సుపై కాల్పులు జరిపి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఉగ్రవాదులు..32 మంది ప్రయాణికులు సజీవదహనం
- Telangana : దుబాయ్లో నల్గొండ వాసి మృతి
- Kabul Attack : లాలించిన మహిళా సైనికురాలు ఇక లేరు
1Madhya Pradesh : మద్యం తాగుతూ కారు డ్రైవింగ్..రోడ్డుపై కత్తితో మాజీ మంత్రి కొడుకు హల్ చల్
2తెలుగు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు
3రష్యా సైనికుడికి జీవిత ఖైదు శిక్ష
4బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్ కీలక నిర్ణయం
5హిట్లర్ కంటే దారుణపాలన – మమత
6Kiara Advani : పెళ్లి చేసుకోకుండా కూడా లైఫ్లో సెటిల్ అవ్వొచ్చు.. డబ్బులు సంపాదిస్తే చాలు..
7Contract Jobs : ప్రకాశం జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఒప్పంద ఉద్యోగాల భర్తీ
8నేడు ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల
9Subramaniam Murder : సుబ్రమణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్
10Qutub Minar Row: కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ
-
Peddapalli : నిత్యపెళ్లి కొడుకు..గుట్టురట్టు చేసిన నాలుగో భార్య
-
Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్న్యూస్
-
Rohini Karte 2022 : రోహిణికార్తె వస్తోంది జాగ్రత్త.. భానుడు ఉగ్రరూపం చూపించే టైం..!
-
Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
-
Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
-
Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
-
Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
-
Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు