kim jong un : నార్త్ కొరియాలో కరోనా కల్లోలం..జనాలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోకుండా క్షిపణి ప్రయోగాల్లో బిజీ బిజీగా కిమ్

ఉత్తర కొరియాను కరోనా అల్లాడిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు మాత్రం.. అది పెద్ద మ్యాటరే కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జనాలను పట్టించుకోవడం లేదు కదా.. క్షిపణి ప్రయోగాలతో అమెరికాలాంటి దేశంతోనే గిల్లీ పంచాయితీ పెట్టుకుంటున్నారు. 35 నిమిషాల్లో 8 మిస్సైల్స్‌ ప్రయోగించి.. కిమ్‌ ఒక్కసారిగా టెన్షన్‌ పుట్టించారు.

kim jong un : నార్త్ కొరియాలో కరోనా కల్లోలం..జనాలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోకుండా క్షిపణి ప్రయోగాల్లో బిజీ బిజీగా కిమ్

North Korea

North Korean  : ఉత్తర కొరియాను కరోనా అల్లాడిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు మాత్రం.. అది పెద్ద మ్యాటరే కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జనాలను పట్టించుకోవడం లేదు కదా.. క్షిపణి ప్రయోగాలతో అమెరికాలాంటి దేశంతోనే గిల్లీ పంచాయితీ పెట్టుకుంటున్నారు. 35 నిమిషాల్లో 8 మిస్సైల్స్‌ ప్రయోగించి.. కిమ్‌ ఒక్కసారిగా టెన్షన్‌ పుట్టించారు.

ఉత్తరకొరియాలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కానీ ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్‌ మాత్రం తన బిజీలో తాను ఉన్నారు. క్షిపణి పరీక్షల్లో బిజీబిజీగా కనిపించారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. ఏ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. అమెరికా ఎన్ని సార్లు హెచ్చరికలు చేసినా లెక్క చేయకుండా ఉత్తర కొరియా మాత్రం వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది. రాజధాని ప్యాంగాంగ్‌కు సమీపంలోని సునన్ అనే ప్రాంతంలో 35 నిమిషాల వ్యవధిలో 8 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఒక్కరోజులో ఉత్తర కొరియా ప్రభుత్వం అత్యధిక బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి.

ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. త్వరలోనే మళ్లీ ఉత్తర కొరియా అణు పరీక్షలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించడానికి జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించనున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తెలిపారు. ఇటీవల అమెరికా నావికా దళాలు, దక్షిణ కొరియా సైన్యంతో కలిసి ఫిలిప్పీన్స్ సముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించాయ్. ఇందులో అమెరికా విమాన వాహక నౌక రోనాల్డ్ రీగన్ సైతం పాల్గొంది. 2017 తర్వాత విన్యాసాల్లో ఓ ఎయిర్​క్రాఫ్ట్ క్యారియర్ పాల్గొనడం ఇదే ఫస్ట్‌టైమ్‌. ఈ పరిస్థితుల్లోనే ఉత్తరకొరియా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది.

ఉత్తర కొరియా చేపట్టిన ఎనిమిది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రం వైపు ప్రయోగించారు. వీటిని దక్షిణ కొరియా సైన్యం గుర్తించింది. ఇక అటు జపాన్‌ కూడా ఈ ప్రయోగాలను ధ్రువీకరించింది. అమెరికా, దక్షిణ కొరియా ఉమ్మడి సైనిక విన్యాసాలను… ఉత్తరకొరియా మొదటినుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. వాటిని తమపై దాడుల కోసం చేపడుతోన్న రిహార్సల్స్‌ అంటున్న కిమ్ జోంగ్‌.. తాము ఏంటో చూపించాలని అనుకున్నారని.. అందుకే యూఎస్‌ హెచ్చరికలను కూడా బేఖాతరు చేశారన్న చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం చేపట్టిన ప్రయోగాలతో నార్త్‌ కొరియా 2022లో క్షిపణి పరీక్షల సంఖ్య ఏకంగా 18కి చేరుకుంది. ఈ పరీక్షల్లో ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు కూడా ఉన్నాయ్. ఇక అటు ఉత్తర కొరియా అణు పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల కారణంగా అమెరికా భూభాగానికి, తమ పౌరులకు ఎలాంటి ముప్పు లేదని అమెరికా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఓవైపు కరోనాతో జనం అల్లాడిపోతుంటే.. వాళ్ల బాగోగులు చూసుకోకుండా.. అమెరికా, దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా క్షిపణి పరీక్షలు నిర్వహించి.. ఏం ఆనందం పొందుతావ్ కిమ్ అంటూ.. సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది.