Facebook : ఫేస్‌బుక్‌కి బిగ్ షాక్.. రూ.10లక్షల కోట్ల పరిహారం చెల్లించాలంటూ దావా

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై రోహింగ్యాలు ఫైర్ అవుతున్నారు. ఫేస్ బుక్ నుంచి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ దావా వేశారు.

Facebook : ఫేస్‌బుక్‌కి బిగ్ షాక్.. రూ.10లక్షల కోట్ల పరిహారం చెల్లించాలంటూ దావా

Facebook

 

Facebook : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై రోహింగ్యాలు ఫైర్ అవుతున్నారు. ఫేస్ బుక్ నుంచి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ దావా వేశారు. ఫేస్ బుక్ వల్ల తమ జీవితాలు నాశనం అయ్యాయని రోహింగ్యాలు వాపోయారు. ఇందుకు గాను 150 బిలియన్ డాలర్లు (రూ.10 లక్షల కోట్లు) భారీ పరిహారం డిమాండ్ చేస్తున్నారు.

LPG Cylinder : వంట గ్యాస్ సిలిండర్ బరువు భారీగా తగ్గింపు..? కేంద్రం కీలక ప్రతిపాదన

మయన్మార్ లో రోహింగ్యాలపై విద్వేష ప్రచారం ఫేస్ బుక్ వేదికగానే నడిచిందని, తద్వారా తమ వర్గం తీవ్రస్థాయిలో హింసకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఫేస్ బుక్ విఫలమైందని ఆరోపిస్తున్నారు. తమ వర్గానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడంలో ఫేస్ బుక్ కీలకంగా నిలిచిందని చెబుతూ యూకే, అమెరికాలోని రోహింగ్యా శరణార్థులు శాన్ ఫ్రాన్సిస్కో న్యాయస్థానంలో ఈ దావా వేశారు. నష్టపరిహారం రూపేణా తమకు ఫేస్ బుక్ రూ.10 లక్షల కోట్ల రూపాయలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

రోహింగ్యా శరణార్థుల తరఫున బ్రిటన్ లీగల్ సర్వీసెస్ సంస్థలు ఫీల్డ్స్ పీఎల్ఏసీ, ఎడెల్సన్ పీసీ పిటిషన్ దాఖలు చేశాయి. మయన్మార్ లో తమపై హింసకు ఫేస్ బుక్కే కారణమని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహింగ్యాలు మయన్మార్ లో తీవ్ర అణచివేతకు గురై, ప్రపంచంలోని పలు దేశాలకు శరణార్థులుగా వెళ్లారు.

Lose Weight : తక్కువ తినండి…ఎక్కవగా కదలండి..బరువు తగ్గాలనుకునే వారు…

2017లో మయన్మార్ లో తీవ్ర హింస ప్రజ్వరిల్లింది. 7.5 లక్షల మంది రోహింగ్యాలు ప్రాణాలు చేత బట్టుకుని దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ పరిస్థితికి ఫేస్ బుక్ లో జరిగిన ప్రచారమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. 2018లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల దర్యాప్తు బృందం కూడా ఫేస్ బుక్ ప్రచారమే హింసకు దారితీసిందని నిర్ధారించిందంటూ రోహింగ్యాలు తమ పిటిషన్ లో తెలియజేశారు. రోహింగ్యా శరణార్థులు కోర్టును ఆశ్రయించడంపై ఫేస్ బుక్ ఇంకా స్పందించ లేదు.