Baba Vanga :‘పుతిన్ ప్రపంచానికి రాజు అవుతాడు..రష్యా ఈ లోకాన్ని శాసించబోతోంది..దీన్నిఎవరూ ఆపలేరు’ : బాబా వంగా జోస్యం

పుతిన్ ప్రపంచానికి రాజు అవుతాడు..రష్యాను ప్రపంచాన్ని శాసించబోతోంది..దీన్నిఎవరూ ఆపలేరు’ అంటూ బాబా వంగా చెప్పిన జోస్యం నిజమవుతుందా?యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న హాట్ టాపిక్ గా..

Baba Vanga :‘పుతిన్ ప్రపంచానికి రాజు అవుతాడు..రష్యా ఈ లోకాన్ని శాసించబోతోంది..దీన్నిఎవరూ ఆపలేరు’ : బాబా వంగా జోస్యం

Baba Vanga On Vladimir Putin

Baba Vanga on Vladimir Putin: ‘బాబా వంగా’. ఆమె ఓ అంధ జ్యోతిషురాలు. ఆధ్యాత్మికవేత్త. కానీ ప్రపంచంలో జరిగే పరిణామాల గురించి కొన్ని దశాబ్దాల ముందే చెప్పే జ్యోతిషురాలిగా పేరొందారు. అంధురాలే అయినా ఆమె తన మనోనేత్రంతో ఈ ప్రపంచంలో జరగబోయే పరిణామల గురించిముందే చెబుతారనే పేరొందారు. ఆమె చెప్పినవి దాదాపు 85 నిజమయ్యా కూడా. అమెరికాపై ట్విన్ టవర్స్ పై దాడులు జరుగుతాయని ఆ దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు అని..2004లో భారీ సునామీ వచ్చి అపార ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని.. అలాగే సిరియా నుంచి ముస్లిం యుద్ధం ప్రారంభమవుతుందని ఆమె చెప్పిన జ్యోతిషాలు నిజమయ్యాయి. అంతేకాదు యుక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తుందని బాబా వాంగా 43 ఏళ్ల కిందటే చెప్పడం గమనించాల్సిన విషయం.

Also read : Talks In Istanbul : ఇస్తాంబుల్‌ వేదికగా.. రేపు యుక్రెయిన్‌- రష్యా మధ్య శాంతి చర్చలు..!

యుక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయదని చాలామంది యుద్ధానికి ముందు రోజు వరకు అనుకున్నారు. కానీ రష్యా మాత్రం కేవలం బెదిరింపులే కాదు అంటూ యుద్ధానికి దిగింది. అప్పుడే నెల రోజులు కూడా దాటిపోయింది. ఈ యుద్ధం గురించే కాదు రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ గురించి చాలా గొప్పగా చెప్పారీ అంధ జ్యోతిషురాలు బాబా వంగా..!! రష్యా-యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ బాబా వంగా జ్యోతిష్యం మరోసారి వార్తల్లోకొచ్చింది.

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ముందుగానే ఊహించిన బాబా వంగా.. ‘వ్లాదమిర్ పుతిన్ ప్రపంచానికి ప్రభువు అవుతాడు’అంటూ 43 ఏళ్ల కిందటే అంచనా వేసింది. ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టారట.. బాబా వాంగా (Blind mystic Baba Vanga) మరణానికి ముందు ప్రపంచానికి సంబంధించిన సంఘర్షణ గురించి హెచ్చరించారు. 1979 లో ప్రముఖ రచయిత వాలెంటిన్ సిడోరోవ్‌తో బర్మింగ్ హామ్ లో జరిగిన సమావేశంలో బాబా వంగా ఏం చెప్పారంటే..‘‘అన్నీ మంచులా కరిగిపోతాయి, ఒక్క దానిని మాత్రమే తాకలేరు.. అదే (వ్లాదిమిర్ పుతిన్ కీర్తి) రష్యా కీర్తి’’ని అంటూ తెలిపారు. రష్యాను ఎవరూ ఆపలేరని.. ప్రపంచాన్ని రష్యా శాసించబోతోందని ఆమె తెలిపారు. వ్లాదిమిర్ పుతిన్ పర్వత శిఖరంలా పెరుగుతుందని జోస్యం చెప్పారు బాబా వాంగా..! ఆమె చెప్పినట్లుగానే యుక్రెయిన్‌పై రష్యా యుద్దానికి దిగింది.

Also read : Russia Soldiers Killed : రష్యాకు బిగ్ లాస్..! యుద్ధంలో 17వేల మందికి పైగా సైనికులు హతం-యుక్రెయిన్ ఆర్మీ

బాబా వాంగా 26 ఏళ్ల కిందటే 1996లో తన 84వ ఏట కన్నుమూశారు. ఈక్రమంలో జరుగుతున్న పరిణామాలు చాలా వరకు ఆమె జీవించి ఉన్నప్పుడే తెలిపారు అంటున్నారు ఆమె అనుచరులు.తన చిన్నతనంలో ఓ భయంకర పెను తుఫానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వంగా దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను ముందే ఊహించారని చెబుతున్నారు.

అయితే.. బాబా వంగా ప్రపంచ పరిణామాల గురించి ముందే ఊహించి చెప్పిన వాటిలో దాదాపు 85 శాతం నిజమయ్యాయి. అమెరికాపై రెండు లోహ విహంగాల దాడులు జరుగుతాయని, వేలాది మంది అమాయక ప్రజలు చనిపోతారని (9/11 దాడులు) అంచానా వేశారు. దీంతోపాటు 2004లో భారీ సునామీ వచ్చి అపార ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పిన విషయాలు నిజమయ్యాయి. సిరియా నుంచి ముస్లింల యుద్ధం ప్రారంభమవుతుందన్నారు. తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్దం గురించి 43 ఏళ్ల కిందటే అంధ జ్యోతిషురాలు చెప్పడం గమనార్హం. నివేదికల ప్రకారం అంధ ఆధ్యాత్మికవేత్త అణ్వాయుధాల వినియోగం, మూడో ప్రపంచ యుద్ధం గురించి కూడా బాబా వంగా జోస్యం చెప్పారని పేర్కొంటున్నారు.

Also read : Ukraine Russia War : పుతిన్‌పై బైడెన్ కామెంట్స్‌.. వైట్ హౌస్ వివరణ..!

బాబా వాంగా మాటల్లో జరిగిన విషయాలు : 1989లో బాబా వంగా ఇలా అన్నారు: “హారర్, భయానక! ఉక్కు పక్షుల దాడి జరుగుతుంది. ఎంతోమంది అమాయకులు చనిపోతారు. తోడేళ్ళు పొదలో అరుస్తాయి.అమాయకుల రక్తం కారుతుంది. అదే “సెప్టెంబరు 11, 2001న, ఇస్లామిక్ తీవ్రవాదులు హైజాక్ చేసిన విమానాలు న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఢీకొన్నాయి. వేలాది మంది మరణించారు.