Islands : భారత్ సమీపంలోని మూడు దీవులు చైనాకు అప్పగింత

భారత్ సమీపంలోని శ్రీలంకకు చెందిన 3 దీవులను చైనాకు అప్పగించినట్లు ఆ దేశ ఎంపీ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. పవన విద్యుత్తు తయారీ కోసం ఈ దీవులను తమ దేశం చైనాకు అప్పగించిందని తెలిపారు.

Islands : భారత్ సమీపంలోని మూడు దీవులు చైనాకు అప్పగింత

Radhakrishnan

Sri Lanka Three islands : భారత్ సమీపంలోని శ్రీలంకకు చెందిన 3 దీవులను చైనాకు అప్పగించినట్లు ఆ దేశ ఎంపీ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. పవన విద్యుత్తు తయారీ కోసం ఈ దీవులను తమ దేశం చైనాకు అప్పగించిందని వెల్లడించారు. దీంతో భారత్‌కు ముప్పు ఉంటుందని భావించి శ్రీలంక తమిళులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. శ్రీలంక మలైయగ మక్కళ్‌ మున్నణి అధ్యక్షుడు, ఆ దేశ ఎంపీ రాధాకృష్ణన్‌ తమిళనాడులోని తిరుచ్చి వచ్చారు.

ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్‌ మొహిద్దీన్‌ నివాసంలో శనివారం (సెప్టెంబర్11, 2021) రాధాకృష్ణన్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని శ్రీలంక శరణార్థుల శిబిరాలను పునరావాస నివాసాలుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ మార్చడం అభినందనీయమని కొనియాడారు. శ్రీలంకలో తమిళులు నివసించే ప్రాంతంలో భారత్‌ 50 వేల ఇళ్లు నిర్మించిందని తెలిపారు.

China-Sri Lanka : ఉత్తర శ్రీలంకలో చైనా ఆదిపత్యం..భారత్ ఆందోళన!

రైలు మార్గం, యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. తమ దేశంలో 500 హెక్టార్ల విస్తీర్ణంలో చైనా పోర్టును ఏర్పాటు చేస్తోందని, ఇప్పటివరకు 70శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. వ్యాపార దృక్పథంతో చైనా పెట్టుబడులకు శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు.