కొండచరియలు విరిగిపడి, 22 మంది బంధువులను కోల్పోయిన మహిళ

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 11:29 AM IST
కొండచరియలు విరిగిపడి, 22 మంది బంధువులను కోల్పోయిన మహిళ

Woman loses 22 relatives after landslide : ఊహలకందని విషాదం. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ఆమె 22 మంది బంధువులను కోల్పోయి తీవ్ర విచారంలో మునిగిపోయింది. శక్తివంతమైన ఈటా తుపాన్ వల్ల భారీ వర్షాలు, వరదలు పోటెత్తున్న సంగతి తెలిసిందే. తుపాన్ వల్ల ఓ గ్రామం..మొత్తం బురదనీటిలో కూరుకపోయిందని అలెజాండ్రో గియామ్మట్టే చెప్పారు.



సహాయ చర్యలు చేపట్టేందుకు క్యూజా గ్రామంలో సైనికులను రంగంలోకి దించారు. ఈ కారణంగా..ఎంతో మంది అదృశ్యమయ్యారని తెలుస్తోంది. Alta Verapaz లో ఓ పర్వతం కూలడంతో..డజన్ల కొద్ది ప్రాణాలు పోయాయి. తన కుటుంబానికి చెందిన 22 మంది చనిపోయారని క్యూజా నివాసి Gloria Cac వెల్లడించారు. ఆమె మాత్రమే ప్రాణాలతో బయటపడింది. తండ్రి, అమ్మ, తోబట్టువులు, అత్త మామలు, మేనమామలు, తాతలు ప్రాణాలు పోయిన వారిలో ఉన్నారు.



నిరంతరం వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని రిటైర్డ్ జనరల్ Francisco Muz తెలిపారు. క్యూజా గ్రామంలో San Cristobal Verapaz తీవ్ర విషాదం నెలకొందన్నారు. పనామా నుంచి కోస్టా రికా, నికరాగువా, హోండురాస్, మెక్సికో వరకు భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.