IPL 2021- MI vs DC : మెరిసిన మిశ్రా.. ఢిల్లీ లక్ష్యం 138 పరుగులు
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు ఢిల్లీకి 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
IPL 2021- MI vs DC : ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు ఢిల్లీకి 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ముంబైని మట్టికరిపించాడు. నాలుగు ఓవర్లలో (4/24)తో ముంబై ఆట కట్టడించాడు. ముంబై బ్యాట్స్మెన్లో కెప్టెన్ రోహిత్ శర్మ(44; 30 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సులు)తో రాణించాడు.
ఇషాన్ కిషన్(26), జయంత్ యాదవ్(23), సూర్యకుమార్ యాదవ్ (24) పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లలో డికాక్ (2), హార్దిక్ పాండ్యా (0), కృనాల్ పాండ్యా (1), కిరోన్ పోలార్డ్ (2), రాహుల్ చాహర్ (6), బుమ్రా (3 నాటౌట్), బౌల్ట్ (1 నాటౌట్)గా పేలవ ప్రదర్శనతో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.
దాంతో ముంబై స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకుంది. ఢిల్లీ బౌలర్లలో మిశ్రా ఒక్కడే నాలుగు వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్ 2 వికెట్లు, స్టోయినిస్, రబాడ, లలిత్ చెరో వికెట్ పడగొట్టారు.