Omicron Suspects : ఢిల్లీ హాస్పిటల్ లో 12 ఒమిక్రాన్ అనుమానిత కేసులు!
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం రేపుతోంది. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కాగా.. ఇప్పుడు ఢిల్లీలోని లోక్నాయక్
Omicron Suspects కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం రేపుతోంది. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కాగా.. ఇప్పుడు ఢిల్లీలోని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (LNGP) హాస్పిటల్ లో చేరిన కరోనా బాధితుల్లో 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు అనుమానిస్తున్నారు.
గురువారం LNGPలో ఎనిమిది మంది ఒమిక్రాన్ అనుమానితులు చేరగా, ఇవాళ మరో నలుగురు అనుమానితులు చేరినట్లు సమాచారం. ఇవాళ హాస్పిటల్ లో చేరిన నలుగురిలో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని,మిగిలిన ఇద్దరి టెస్ట్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
కాగా,ఇవాళ హాస్పిటల్ లో చేరిన నలుగురిలో.. ఇద్దరు యూకేకు చెందినవారు కాగా, ఒకరు ఫ్రాన్స్కు, ఇంకొకరు నెదర్లాండ్స్కు చెందిన వారని తెలుస్తోంది. బాధితులకు సోకింది ఒమిక్రాన్ వేరియంటా కాదా అన్నది నిర్ధారణ కోసం వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్ కి పంపించారు.
ALSO READ Super Strain : మరో కొత్త వేరియంట్ రావచ్చు..డెల్టా+ఒమిక్రాన్= సూపర్ స్ట్రెయిన్!