మృత్యుంజయుడు : కరోనాను జయించిన 36 రోజుల పసికందు

  • Published By: madhu ,Published On : May 28, 2020 / 06:51 AM IST
మృత్యుంజయుడు : కరోనాను జయించిన 36 రోజుల పసికందు

కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దీని కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు వైద్యులు. చిన్న పిల్లోడి నుంచి మొదలుకొని..వృద్ధుల వరకు వైరస్ బారిన పడుతూ చనిపోతున్నారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారు త్వరగా కోలుకుని మృత్యుముఖం నుంచి బయటపడుతున్నారు.

వృద్ధులు, పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. దీంతో వీరే ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. వీరిని బతికించడం కోసం వైద్యులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ బారిన పడిన 36 రోజుల పసికందు మృత్యుంజయుడుగా నిలిచాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. 
భారతదేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో తెలిసిందే. ప్రధానంగా…మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

ముంబైలోని 36 రోజుల బాలుడికి కరోనా సోకింది. దీంతో తల్లిదండ్రులు సియాన్ పిల్లల ఆసుపత్రిలో చేరిపించారు. అక్కడి వైద్యులు నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా చికిత్స అందించారు. దాదాపు 15 రోజుల పాటు చికిత్స అందించారు. అనంతరం పరీక్షలు నిర్వహించారు. ఇందులో నెగటివ్ రిపోర్టు వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాత..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 

బాలుడు కరోనాను జయించడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. తల్లి బాలుడిని ఎత్తుకుని ఆసుపత్రికి బయటకు వస్తున్న వీడియోను మహారాష్ట్ర సీఎం కార్యాలయం ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ చేసింది. వైద్యులు, నర్సులు, ఇతర మెడికల్ సిబ్బంది అంతా చప్పట్లతో వీడ్కోలు పలికారు. 

 

Read:  పుల్వామా లాంటి మరో ఘటనను అడ్డుకున్న భారత బలగాలు