Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని చంపేస్తానని లేఖ ద్వారా బెదిరించిన వ్యక్తి అరెస్ట్

భారత్ జోడో యాత్రలో భాగంగా ఇండోర్‌కు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హత్య చేస్తానని లేఖ ద్వారా బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని దయా అలియాస్ ప్యారే అలియాస్ నరేంద్ర సింగ్‌గా గుర్తించారు.

Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని చంపేస్తానని లేఖ ద్వారా బెదిరించిన వ్యక్తి అరెస్ట్

Rahul Gandhi

Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో భాగంగా ఇండోర్‌కు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హత్య చేస్తానని లేఖ ద్వారా బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని దయా అలియాస్ ప్యారే అలియాస్ నరేంద్ర సింగ్‌గా గుర్తించారు. ఉజ్జయిని జిల్లాలోని నగ్డా ప్రాంతంలో అతడిని అరెస్టు చేశారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర కోసం ఇండోర్‌కు రాగానే బాంబు పేలుస్తానని బెదిరిస్తూ లేఖ రాశారని ఆరోపణలున్నాయి.

Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. ఫొటోలు

రాహుల్‌గాంధీని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన నిందితుడి ఆచూకీ గురించి తెలియజేసేందుకు ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ ఓ ఫోటోను పంపిందని నాగ్డా పోలీస్ సూపరింటెండెంట్ సత్యేంద్ర కుమార్ శుక్లా తెలిపారు. నాగ్డాలోని బైపాస్‌లో అనుమానితుడు గుర్తించినట్లు సమాచారం అందేలోపు నాగ్డా పోలీసులు ఫోటో ఆధారంగా నిందితుడి కోసం సోదాలు నిర్వహించారని ఆయన చెప్పారు.

Rahul Gandhi: రాహుల్ యాత్రలో సినీ తారలు.. డబ్బులిచ్చి రప్పిస్తున్నారంటూ బీజేపీ విమర్శ

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వ్యక్తిని పట్టుకుని, పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆధార్ కార్డ్‌లోని చిరునామా ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన వ్యక్తి అని చెబుతుందని శుక్లా చెప్పారు. ఇండోర్ పోలీసులు మొత్తం విషయాన్ని విచారించిన తర్వాత పరిస్థితి స్పష్టమవుతుందని పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.