Rahul Gandhi: రాహుల్ యాత్రలో సినీ తారలు.. డబ్బులిచ్చి రప్పిస్తున్నారంటూ బీజేపీ విమర్శ

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో సినీ తారలు పాల్గొంటుండటంపై బీజేపీ విమర్శలు చేసింది. సినీ నటులకు కాంగ్రెస్ పార్టీ డబ్బులిచ్చి రప్పించుకుంటోందని విమర్శించింది.

Rahul Gandhi: రాహుల్ యాత్రలో సినీ తారలు.. డబ్బులిచ్చి రప్పిస్తున్నారంటూ బీజేపీ విమర్శ

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో పలువురు సినీ తారలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా భట్, రష్మి దేశాయ్, అమోల్ పాలేకర్, రియా సేన్ వంటి సినీ, టీవీ రంగాలకు చెందిన తారలు ఈ యాత్రలో పాల్గొన్నారు.

Sabarimala Pilgrims: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. విమానంలో ఇరుముడి తీసుకెళ్లేందుకు అనుమతి

రాహుల్ గాంధీ చేయిపట్టి నడిచారు. అయితే, ఇలా సినీ తారలు రాహుల్ యాత్రలో పాల్గొనడంపై బీజేపీ స్పందించింది. నటులకు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి, యాత్రకు రప్పించుకుంటోందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్విట్టర్ వేదికగా ఈ అంశంపై విమర్శలు చేశారు. అమిత్ ట్వీట్ ప్రకారం.. నటులు ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొనేందుకు కాంగ్రెస్ డబ్బులిస్తోంది. రాహుల్‌తోపాటు 15 నిమిషాలు నడిస్తే చాలు… డబ్బులు చెల్లిస్తోంది. నటులు వాళ్లకు వీలు దొరికినప్పుడే యాత్రలో పాల్గొనాలి. ఇందుకోసం అయ్యే రవాణా, ఇతర ఏర్పాట్లు అన్నింటినీ కాంగ్రెస్ పార్టీనే పర్యవేక్షిస్తుంది. నటీనటులు ఇందుకోసం తగిన టైమ్ స్లాట్ ఎంచుకోవచ్చు. అది కూడా నవంబర్‌లోనే యాత్రలో పాల్గొనాలి.

T20 World Cup 2024: రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో మార్పులు.. పోటీలో 20 జట్లు.. నాలుగు గ్రూపులు

ఈ ట్వీట్ ప్రకారం వాట్సాప్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నటులతో చర్చలు జరుపుతోంది. డబ్బులు ఇస్తామని చెబుతున్నప్పటికీ రాహుల్ గాంధీతో ఎవరు నడుస్తారు అంటూ అమిత్ మాలవీయ ప్రశ్నించారు. అయితే, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. రాహుల్ చేపట్టిన యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే, నిరాశతో బీజేపీ ఈ విమర్శలు చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. రాహుల్ యాత్రలో పాల్గొనే వాళ్లు ఒక లక్ష్యం కోసం, దేశం కోసం వస్తున్నారని కాంగ్రెస్ చెప్పింది.