Adivi Sesh: ‘మేజర్’ అప్‌డేట్ ఇచ్చిన హీరో!

టాలీవుడ్‌లో ప్రామిసింగ్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో అడివి శేష్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

Adivi Sesh: ‘మేజర్’ అప్‌డేట్ ఇచ్చిన హీరో!

Major

Adivi Sesh: టాలీవుడ్‌లో ప్రామిసింగ్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో అడివి శేష్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన నటించిన క్షణం, ఎవరు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, ఈసారి ఓ విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. 26/11 ముంబై కాల్పుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ‘మేజర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ హీరో.

Major: నా కుమారుడి బయోపిక్‌కి 100 శాతం న్యాయం చేయలేరు : మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి

మేజర్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమా నుండి ఓ మేజర్ అప్‌డేట్ రాబోతున్నట్లు హీరో అడివి శేష్ తెలిపారు. మార్చి 15న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా ‘మేజర్’ చిత్రం నుండి ఓ స్పెషల్ ట్రీట్ ఉండబోతున్నట్లు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.

గతంలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక వేసవి కానుకగా ఈ చిత్రాన్ని మే 27న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ భాషలో ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో మేజర్ పాత్రలో అడివి శేష్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

MAJOR: ‘మేజర్’.. విడుదల వాయిదా..

శశి కుమార్ తిక్కా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్, శోభితా ధూలిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నాడు. మరి మార్చి 15న మేజర్ సినిమా నుండి రాబోతున్న సర్‌ప్రైజ్ ఏమిటా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. సోనీ పిక్చర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.