Cow Urine : గోవు మూత్రం తాగితే కరోనా రాదంటున్న బీజేపీ ఎమ్మెల్యే

కరోనా రాకుండా ఉండాలంటే గోవు మూత్రం తాగాలని యూపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చెప్పడం చర్చనీయాంశమైంది.

Cow Urine : గోవు మూత్రం తాగితే కరోనా రాదంటున్న బీజేపీ ఎమ్మెల్యే

Bjp Mla

BJP MLA : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనాలు సృష్టిస్తోంది. దిక్కుమాలిన వైరస్ కారణంగా..రోజుకు 3 నుంచి 4 వేల మంది చనిపోతున్నారు. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. కరోనా రాకుండా ఉండేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్ లు ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి చేస్తున్నారు.

అయితే..కరోనా రాకుండా ఉండాలంటే గోవు మూత్రం తాగాలని యూపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చెప్పడం చర్చనీయాంశమైంది. ట్విట్టర్ వేదికగా..ఓ వీడియోను పోస్టు చేశారు. తాను రోజూ గో మూత్రం తీసుకుంటున్నానని..అందుకే త‌న‌కు క‌రోనా సోక‌డం లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. కోవిడ్ నివారించడానికి రోజూ గోవు మూత్రం తాగాలని ప్రజలకు సూచన ఇచ్చారు.

”బల్లియా నియోజకవర్గ ప్రజలకు తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నట్లు, పతంజలి గోదాన్ సారం..ప్రతి రోజు ఉదయం..చల్లటినీటిలో ఐదు మూతల గోవు మూత్రం వేసి..పరిగడుపున తాగుతానని, తాగిన తర్వాత.. రోజూ మీ అందరి మధ్య 18 గంటలు పాటు నిరంతరం ఉంటున్నాను. అయినా నాకు కరోనా సోకడం లేదని చెప్పడం విశేషం. గతంలో కూడా పలువురు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.