Dasari Narayanarao : దాసరిని మర్చిపోయారు.. సినీ కార్మికోత్సవంపై సి.కళ్యాణ్ అసంతృప్తి

ఇటీవల మేడే రోజున సినీ కార్మికోత్సవం అంటూ భారీగా సభ నిర్వహించారు. ఈ సభకి టాలీవుడ్ లో 24 రంగాల్లో పని చేసేవారంతా హాజరయి దీనిని సక్సెస్ చేశారు. ఈ సభకి చిరంజీవి ముఖ్య అతిధిగా రాగా..........

Dasari Narayanarao : దాసరిని మర్చిపోయారు.. సినీ కార్మికోత్సవంపై సి.కళ్యాణ్ అసంతృప్తి

C Kalyan

 

Dasari Narayanarao :  ఇటీవల మేడే రోజున సినీ కార్మికోత్సవం అంటూ భారీగా సభ నిర్వహించారు. ఈ సభకి టాలీవుడ్ లో 24 రంగాల్లో పని చేసేవారంతా హాజరయి దీనిని సక్సెస్ చేశారు. ఈ సభకి చిరంజీవి ముఖ్య అతిధిగా రాగా, పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అనుకున్నదానికంటే భారీగా విజయవంతంగా జరిగింది ఈ సినీ కార్మికోత్సవం. అయితే ఈ కార్యక్రమం నిర్వాహణపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజాగా జరిగిన దాసరి ఫిలిం అవార్డు వేడుకల్లో సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ”దాసరి నారాయణరావు లేకపోతే కార్మికులు లేరు. మేడే రోజు సినీ కార్మికులంతా దాసరిని మరిచిపోవడం బాధకరం. దాసరి, ప్రభాకర్ రెడ్డి లేకపోతే ఈరోజు కార్మికులు ఇంత సుఖంగా ఉండేవారు కాదు. సినీ కార్మికులు దాసరిని, ప్రభాకర్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాలి” అంటూ వ్యాఖ్యలు చేశారు.

Actress Suhasini : హిందీ భాషా వివాదం..సీనియర్ నటి సుహాసిని సంచలన వ్యాఖ్యలు

అయితే సినీ కార్మికోత్సవాన్ని నిర్వహించిన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కూడా దాసరి ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొనడంతో సి.కళ్యాణ్ మాటలకి సమాధానమిచ్చారు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. ”దాసరి ఫొటో పెట్టుకొనే సినీ కార్మికోత్సవాన్ని చేశాం. దాసరి ఫొటోకు దండ వేయడం మరిచిపోయాం, అది తప్పే. ఇక నుంచి దాసరిని స్మరించుకోకుండా ఫిల్మ్ ఫెడరేషన్ ఏ కార్యక్రమం చేయదు. దాసరిని విస్మరించడం తప్పే” అని తెలిపారు.