Jai Bheem : సూర్య, జ్యోతికలకు షాకిచ్చిన చెన్నై కోర్టు..

Jai Bheem : సూర్య, జ్యోతికలకు షాకిచ్చిన చెన్నై కోర్టు..

Suriya

Jai Bheem :  తమిళ స్టార్‌ హీరో సూర్య ఇటీవల నటించిన జై భీమ్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పలు అవార్డుని కూడా దక్కించుకుంది. విమర్శకులు సైతం ఈ సినిమాని ప్రశంసించారు. అయితే సినిమా రిలీజ్ అయిన సమయంలోనే ఇందులో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందినవారు ఆందోళనలు చేశారు. అంతేకాక సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్ రాజాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులో కూడా కేసు వేశారు.

Urfi Javed : సమంత చేస్తే కరెక్ట్.. నేను చేస్తే తప్పా??

Jai Bheem

వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 నవంబర్‌లో జై భీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. గతంలో పలుమార్లు ఈ కేసుని విచారించిన కోర్టు సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ రాజాని విచారణకి కోర్టుకి హాజరవ్వాలని తెలిపింది. అయితే వారెవ్వరూ కోర్టుకి రాలేదు. దీంతో తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, ఈ సినిమా నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌లు గతంలో పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా కోర్టుకి హాజరు కాలేదు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది చెన్నై కోర్టు.