Chiaranjeevi : పద్మ అవార్డు విజేతలకు చిరంజీవి ప్రత్యేక అభినందనలు..

మెగాస్టార్ ఈ ట్వీట్ లో.. ''పద్మ అవార్డులు పొందిన విజేతలందరికీ నా శుభాభినందనలు. వీరిలో మన రాష్ట్రానికి చెందిన ప్రముఖులు గరికపాటి నరసింహారావు, శ్రీమతి షావుకారు జానకి, శ్రీమతి........

Chiaranjeevi : పద్మ అవార్డు విజేతలకు చిరంజీవి ప్రత్యేక అభినందనలు..

Chiranjeevi

Chiaranjeevi :  రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులని మంగళవారం సాయంత్రం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల నుంచి అనేక రంగాలలో సేవలందించిన ఎంతోమంది ప్రముఖులకు ఈ అవార్డులని ప్రకటించారు. మన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు కూడా పద్మ అవార్డులు దక్కాయి. పద్మ అవార్డులు దక్కిన వారికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పద్మ అవార్డులు దక్కిన వారికి తనదైన శైలిలో ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.

Sonu Nigam : సింగర్ సోనూనిగమ్‌కు పద్మశ్రీ.. 

మెగాస్టార్ ఈ ట్వీట్ లో.. ”పద్మ అవార్డులు పొందిన విజేతలందరికీ నా శుభాభినందనలు. వీరిలో మన రాష్ట్రానికి చెందిన ప్రముఖులు గరికపాటి నరసింహారావు, శ్రీమతి షావుకారు జానకి, శ్రీమతి పద్మజ రెడ్డి, మొగిలయ్య, శ్రీ షేక్ హాసన్, సుంకర ఆది నారాయణ, కృష్ణ సుచిత్ర ఎల్లా, నా మిత్రుడు గులాంనబీ ఆజాద్, సింగర్ సోనూనిగమ్ కు, భారత దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గురింపు తెచ్చిన సత్య నాదెళ్ల, సుందర్ పిచయ్ లు ఉండటం మరింత సంతోషం. వీరికి నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు” అని పోస్ట్ చేశారు. గతంలో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.