Liger: హైప్ క్రియేట్ చేస్తున్న లైగర్.. ట్రైలర్ కోసం ఇద్దరు స్టార్స్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్ర ట్రైలర్‌ను జూలై 21న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Liger: హైప్ క్రియేట్ చేస్తున్న లైగర్.. ట్రైలర్ కోసం ఇద్దరు స్టార్స్!

Chiranjeevi Prabhas To Launch Liger Telugu Trailer

Liger: టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైగర్ సినిమా ట్రైలర్ మరికొన్ని గంటల్లో రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో నార్త్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఆతృతగా చూస్తున్నారు.

Liger: లైగర్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జూలై 21న ఉదయం 9.30 గంటలకు రిలీజ్ చేసేందుకు లైగర్ చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ ట్రైలర్‌ను తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలు లాంఛ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌లు ఈ సినిమా ట్రైలర్‌ను లాంఛ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Liger: ‘అక్డీ పక్డీ’ ఫుల్ సాంగ్ రిలీజ్.. రెచ్చిపోయిన లైగర్!

ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రేపు ఉదయం 9.30 గంటలకు రిలీజ్ అవుతున్న లైగర్ ట్రైలర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేరవకొండ సరసన బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా, పూరీ కనెక్ట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.