Agnipath Protests : సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నర్సరావుపేట అభ్యర్ధులే ఎక్కువ..?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటివరకు 200 మంది అభ్యర్ధులను పోలీసులు గుర్తించారు. వాట్సప్ గ్రూపుల్లో ఉన్న సభ్యుల వివరాలు సేకరించారు. అందులో పలువురిని అరెస్ట్ చేశారు.

Agnipath Protests : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటివరకు 200 మంది అభ్యర్ధులను పోలీసులు గుర్తించారు. వాట్సప్ గ్రూపుల్లో ఉన్న సభ్యుల వివరాలు సేకరించారు. అందులో పలువురిని అరెస్ట్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభ్యర్ధులను వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి నివాసంలో హాజరు పరచనున్నారు.
నరసరావుపేట నుంచి వచ్చిన అభ్యర్దులే దాడికి దిగినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. వారిలో ఎక్కువ మంది సాయి డిఫెన్స్ అకాడమీ లో చదువుకున్నవారే నని తేలింది. నరసరావుపేటతో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ విద్యార్ధులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అల్లర్లకు కుట్ర చేసింది నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావేనని తేలటంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు ఈరోజు సుమారు మరో 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైల్వే పోలీసుల అదుపులో 22మంది ఉన్నారు. రైల్వే స్టేషన్ పై దాడిచేసి విధ్వంసం సృష్టించిన వారిలో సాయి అకాడమి అభ్యర్ధులు…హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ పేరుతో రెండు రోజల క్రితమే వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మిగిలిన సభ్యులను గుర్తించేందుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వాట్సప్ గ్రూప్ లో రెచ్చగొట్టిన వారిని గుర్తించిన పోలీసులు ఫోన్ నెంబరు ఆధారంగా వారిని పట్టుకోటానికి గాలింపు చేపట్టారు. ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న వారిపై పోలీసులు 14సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారు.
IPC సెక్షన్ 143, 147, 307, 435, 427, 448, 336, 332, 341, 149,150, 151, 152 IRA, 3PDPPA సెక్షన్ల కింద కేసులు నమోదు నమోదు చేస్తున్నారు. గుంటూరు నుంచి హైద్రాబాద్కు వచ్చిన ట్రెయిన్ లో 450 మంది నరసరావుపేట సాయి అకాడమీ కు చెందినవారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హకీంపేట్ ఆర్మీ ర్యాలీకి వచ్చిన వారే విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు …వాట్సప్ గ్రూప్స్,సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా ఆందోళనకారులను గుర్తిస్తున్నారు.
Also Read : Secunderabad Violence Loss : సికింద్రాబాద్ విధ్వంసం.. రైల్వేశాఖకు రూ.12కోట్ల ఆస్తి నష్టం
- BJP: ప్రధాని వేదికపై కూర్చునే అతిథుల పేర్లు ఖరారు
- Secunderabad protests: సికింద్రాబాద్ అల్లర్లు.. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సుబ్బారావు
- Subba Rao Arrest : ఎంత పని చేశావ్ సుబ్బారావ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్..?
- Agnipath: నేడు సుబ్బారావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు!
- Avula Subba Rao : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 10టీవీ చేతిలో సెకండ్ రిమాండ్ రిపోర్ట్.. సూత్రధారులు ఆ ఇద్దరే
1Dadishetty Raja : బచ్చాగాళ్లు, తీసిపారేస్తాం- వాలంటీర్లపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
2Pre Planned Bank Robbery : పక్కా ప్లాన్ ప్రకారమే.. బ్యాంకు చోరీ కేసు విచారణలో షాకింగ్ విషయాలు
3PV Sindhu: పీవీ సింధుకు క్షమాపణలు చెప్పిన మ్యాచ్ రిఫరీ
4Grameena Bank Robbery Case : బ్యాంకు చోరీ కేసు.. బంగారాన్ని రికవరీ చేయడం సాధ్యమేనా? రైతుల్లో తీవ్ర ఆందోళన
5CM Jagan EODB : ఈవోడీబీ ర్యాంకింగ్స్లో అగ్రగామిగా ఏపీ.. అధికారులపై సీఎం జగన్ ప్రశంసల వర్షం
6TGB Robbery Case : బ్యాంకులో నగలకు భద్రతేది? ఆందోళనలో బుస్సాపూర్ రైతులు
7Shraddha Das: ఎగిసిపడుతున్న అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధా దాస్!
8Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
9Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
10Viral News: కొత్త ఆలోచన.. వినూత్నరీతిలో కంపెనీలకు రెజ్యూమ్లు పంపిన యువకుడు..
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
-
Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్వాచ్లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!