CM Dinner Auto Driver : పంజాబ్ లో ఆటో డ్రైవర్ ఇంటికెళ్లి భోజనం చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..
ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్ పంజాబ్ లోని ఆటోడ్రైవర్ ఇంటికెళ్లి భోజనం చేశారు. ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఢిల్లీలోని తన ఇంటికి రావాలని ఆహ్వానించారు.
Aarvind kejriwal ate dinner at punjab auto driver house : పేదా- గొప్పా అనే తారతమ్యాలు ఈ సమాజంలో వేళూనుకుపోయాయి. ఓ పేదవాడి ఇంటికి ప్రముఖులు వెళితే అదోక సంచలన వార్త అవుతోంది. అటువంటిదే ఇది కూడా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ఆటో డ్రైవర్ తన ఇంటికి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. ఆ ఆహ్వానానికి సీఎం కేజ్రీవాల్ సానుకూలంగా స్పందించారు. ఆ ఆటో డ్రైవర్ కూడా అతని ఆటోలోనే వెళ్లి అతనితో కూలి వారి ఇంటిలో నేలమీద కూర్చుని కలిసి భోజనం చేశారు. ఈ ఘటన జరిగింది ఢిల్లీలో కాదు..పంజాబ్ లో కావటం విశేషం. తను పిలుపుకు స్పందించి సీఎం తన ఇంటికి రావటంతో తనతో పాటు కలిసి భోజనం చేయటంతో ఆ సామాన్యుడు తెగ ఆనందపడిపోయాడు.
సోమవారం (నవంబర్ 22,2021) ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్ పంజాబ్లో లూధియానాలో పర్యటించారు. మరికొద్ది నెలల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కేజ్రీవాల్ లూథియానాలోని ఆటోడ్రైవర్లతో సమావేశమయ్యారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో దిలీప్ తివారీ అనే ఓ ఆటోడ్రైవర్ మైక్ తీసుకుని..సీఎంతో మాట్లాడుతు.. ‘‘సీఎంగారూ.. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఆటోడ్రైవర్లకు సహాయం చేశారు. చాలా చాలా సంతోషం. దయచేసి నాదో విన్నపం మన్నిస్తారా? అని అడిగాడు.దానికి కేజ్రీవాల్ చెప్పు అంటూ నవ్వుతు అడిగారు. దానికి దిలీప్ తివారీ సంకోచంగా..‘సీఎం గారూ..ఈ పేద ఆటోవాలా ఇంటికి భోజనానికి రాగలరా? నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా’’ అని కేజ్రీవాల్ను కోరాడు.
దానికి కేజ్రీవాల్ నవ్వుతూ..నువ్వింత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను..అంటూ తప్పకుండా.. ఈ రాత్రికి ఓకేనా?’’ అని అడిగారు. దాంతో దిలీప్ ఎంతగానో సంతోషపడిపోయాడు. దానికి కేజ్రీవాల్ ‘మరి నాతో పాటు ఇంకెవరన్నా రావచ్చా అని అడిగారు.దానికి దిలీప్ తప్పకుండా సార్ ఆనందంగా తలూపాడు. అలా సీఎం కేజ్రీవాల్ తనతో పాటు భగవంత్ మన్, హర్పాల్ సింగ్ లు కలిసి ఆటోవాలా ఇంటికెళ్లి భోజనం చేశారు.
సమావేశం పూర్తయిన తర్వాత కేజ్రీవాల్, భగవంత్, హర్పాల్ సింగ్.. దిలీప్ తివారీ ఆటోలో దిలీప్ తివారి ఇంటికి వెళ్లారు. అతడి కుటుంబసభ్యులతో కాసేపు సరదగా గడిపారు. నేలపై కూర్చుని భోజనం చేశారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ ట్విటర్లో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.ఆటోవాలా కుటుంబం మాపై చూపించిన ప్రేమాభిమానాలకు ముగ్ధుడినయ్యానని..భోజనం చాలా బాగుందని తెలిపారు. ఆటోడ్రైవర్ కుటుంబాన్ని ఢిల్లీలోని తన ఇంటికి రావాలని ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమ్ ఆద్మీ పార్టీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
दिलीप तिवारी ने आज दिल से हमें अपने घर खाने पे बुलाया। उनके परिवार ने इतना प्यार दिया। बेहद स्वादिष्ट भोजन। मैंने उनके पूरे परिवार को दिल्ली में अपने घर अब खाने का आमंत्रण दिया। https://t.co/PqCLUue4pm
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 22, 2021
Punjab के एक Auto Driver के Invitation पर CM @ArvindKejriwal जी उसी की ऑटो में बैठ कर उनके घर खाना खाने पहुँचे! pic.twitter.com/XDcaquwj5s
— AAP (@AamAadmiParty) November 22, 2021