Disha Patani : బాలీవుడ్ స్టార్ లవ్ బర్డ్స్ విడిపోయారా? ఆరేళ్ళ ప్రేమకి బ్రేకప్ చెప్పారా?
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటాని గత ఆరేళ్లుగా లవ్లో ఉన్నారు. డేటింగ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. చాలా సార్లు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ.......
Disha Patani : బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేకప్ లు చాలా కామన్. స్టార్స్ కూడా ప్రేమలో పడతారు, కొన్ని రోజులకి మళ్ళీ బ్రేకప్ చెప్పుకుంటారు, మళ్ళీ ఇంకొకరితో జత కడతారు. ఇదంతా బాలీవుడ్ లో మామూలే. తాజాగా మరో స్టార్ జంట బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటాని గత ఆరేళ్లుగా లవ్లో ఉన్నారు. డేటింగ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. చాలా సార్లు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియా కంట పడ్డారు. వీరి బంధం గురించి అందరికి తెలిసిందే. ఇక టైగర్ సోదరి క్రిష్ణ ష్రాఫ్ దిశా పటానికి మంచి ఫ్రెండ్ కావడంతో టైగర్ ఇంటికి కూడా వెళ్ళేది దిశా. ఈ క్రమంలో వారు మరింత దగ్గరయ్యారు.
Ashwini Dutt : ప్రేక్షకులు థియేటర్కి రాకపోవడానికి పాప్కార్న్, కూల్డ్రింక్స్ కూడా కారణమే..
అయితే తాజాగా వీరిద్దరూ విడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆరేళ్ల ప్రేమకి గుడ్ బై చెప్పినట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయని, కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉండి, ఇటీవలే విడిపోయారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ దీనిపై స్పందించకపోయినా సన్నిహితులు కూడా వీరు విడిపోయారు అనే అంటున్నారు. మరి ఈ వార్తలపై లవ్ బర్డ్స్ స్పందిస్తారో లేదో చూడాలి.