Vasa : పిల్లలకు వస పోస్తే తెలివితేటలు పెరుగుతాయా?..

వసకొమ్ములను పాలలోవేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి వ‌స్తుంది. కంఠ స్వ‌రం చ‌క్క‌గా మారుతుంది.

Vasa : పిల్లలకు వస పోస్తే తెలివితేటలు పెరుగుతాయా?..

Vasa

Vasa : వస అనేది ఒక రకమైన ఔషధ మొక్క. ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలను ఉపయోగించినట్లే వసను కూడా ఉపయోగిస్తారు. ఎన్నో వందల ఏళ్ల నుంచే వసను ఆయుర్వేదంలో వాడుతున్నారు. హిమాలయాల్లో వసకు చెందిన ప్రత్యేకమైన రకం దొరుకుతుంది. దీని వలన గొంతులోని కఫం పోవడమే గాక , మాటలు స్పస్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు. పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ ఈ సాంప్రదాయం కొన్ని ప్రాంతాలలో కొనసాగుతుంది. వస వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో వస ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆందోళన, ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కిడ్నీస్టోన్లు వంటి సమస్యలకు వస పనిచేస్తుంది. ఆకలి బాగా తగ్గిన వారు, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు వస చూర్ణం తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది జీర్ణాశయంలో అగ్నిని పెంచుతుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణాశయంలో అల్సర్లకు, గ్యాస్‌, అసిడిటీ సమస్యలకు వస పనిచేస్తుంది. విరేచనాలు, చర్మ సమస్యలు ఉన్నవారు వసను తీసుకోవాలి. వసకొమ్ములను పాలలోవేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి, మంచి కంఠస్వరం, మంచి శరీరం కాంతి వంతంగా మారుతుంది.

వస కొమ్ములు, తుంగముస్తల గడ్డలు, పసుపు, శొంఠి కొమ్ములు కచ్చాపచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం కాచి తీసుకోవాలి. దీంతో విరేచ‌నాలు త‌గ్గుతాయి. వసకొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మూర్ఛ తగ్గుతుంది. వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి రాస్తుంటే శరీర భాగాల‌పై ఏర్ప‌డే వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. వస కొమ్ము వేసి కాచిన నీళ్లతో గాయాలు, పుండ్ల‌ను కడిగి శుభ్రం చేయాలి. దీంతో అవి త్వ‌ర‌గా మానుతాయి. వసకొమ్ము, దేవదారు వేరు పట్ట లేదా గురవింద గింజలను ముద్దగా నూరి జుట్టు ఊడినచోట లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

వసకొమ్ములను పాలలోవేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి వ‌స్తుంది. కంఠ స్వ‌రం చ‌క్క‌గా మారుతుంది. వసకొమ్ములను, సోంపు గింజలను కలిపి నూరి ముద్దగాచేసి అర్శమొలల మీద ప్రయోగించాలి. దీనికి ముందు నువ్వుల నూనెను వేడిచేసి బాహ్యంగా ప్రయోగిస్తే ఉపశమం ల‌భిస్తుంది. పచ్చి వస కొమ్మును దంచి, రసం పిండి పిప్పళ్లు పొడిని గాని ఇప్ప పువ్వుల రసాన్ని గాని కలిపి తేనె కూడా చేర్చి ముక్కులో నస్యం రూపంలో బిందువులుగా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

పిల్లలకి 4 – 6 నెలల మధ్య వస పోస్తే మంచిది. దీనిని 2, 3 సార్లు పోస్తే చాలు. వసపొయ్యటం ఎప్పుడుపడితే అప్పుడు చెయ్యకూడని అంటుంటారు. ఆదివారంగానీ, బుధవారంగానీ వసపొయ్యాలి. ఆదివారంనాడుపోస్తే ఆయుష్షు పెరుగుతుందనీ, బుధవారంనాడు పోస్తే మంచి బుధ్ధిమంతులూ, తెలివితేటలుకలవాళ్ళూ అవుతారని పెద్దలు చెబుతుంటారు. వస ఏ ఆయుర్వేద మందులు తయారుచేసే పదార్ధాలుండే షాపులోనైనా దొరుకుతుంది. దీనిని తీసుకొచ్చి గంధం తీసే సాన మీద 2, 3 చుక్కల నీరువేసి ఈ వసకొమ్ముని దానిమీద మూడుసార్లు తిప్పి దానిని పిల్లలకి నాకించాలి.

వస చూర్ణం అయితే రోజుకు 1-2 చిటికెలు తీసుకోవచ్చు. భోజనం అనంతరం తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వస క్యాప్సూల్స్‌ రూపంలోనూ లభిస్తుంది. రోజుకు రెండు సార్లు 1-2 క్యాప్సూల్స్‌ను తీసుకోవచ్చు. జీర్ణ సమస్యలు, అల్సర్లు, కిడ్నీ స్టోన్లు తగ్గుతాయి. వసలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల చర్మ సమస్యలకు పనిచేస్తుంది. ఒక టీస్పూన్‌ వస చూర్ణం తీసుకుని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి చర్మంపై సమస్య ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది.

ఒక టీస్పూన్‌ వస చూర్ణం, అంతే మోతాదులో త్రిఫల చూర్ణం తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని పొట్ట మీద, తొడలపై కొవ్వు ఉన్న చోట రాయాలి. ఇలా చేస్తుంటే కొవ్వు కరుగుతుంది. వస మనకు ఎసెన్షియల్‌ ఆయిల్‌ రూపంలోనూ లభిస్తుంది. దీన్ని కూడా వాడవచ్చు. వస నూనెలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి రాస్తుంటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.