‘దృశ్యం 2’ ప్రారంభం..

‘దృశ్యం 2’ ప్రారంభం..

Drushyam 2 Pooja: తన కెరీర్‌లో పలు రీమేక్ లతో సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ వెంకటేష్.. ఇటీవలే తమిళ్ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు మరో రీమేక్‌లో నటించనున్నారు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం’ ఏడేళ్ల క్రితం విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Drushyam 2

ఈ సినిమా సీక్వెల్ ‘దృశ్యం 2’ పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ మీద ఆంటోని పెరుంవబూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Drushyam 2

‘దృశ్యం’ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకీ ఇప్పుడు ‘దృశ్యం 2’ ని కూడా తెలుగులో రీమేక్ చెయ్యనున్నారు. తెలుగులోనూ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై.లి. సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, 50 రోజుల్లో సినిమాను పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు.

Drushyam 2

Drushyam 2