Stabbed 23 Times: వృద్ధుడ్ని కొట్టి 20సార్లు కత్తితో పొడిచిన కొడుకు

ఉత్తరప్రదేశ్ లో కన్నతండ్రినే 23సార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన నమోదైంది. ఈ దాడిలో మృతి చెందిన వ్యక్తిని విజయ్ పాల్ చౌదరిగా గుర్తించారు.

Stabbed 23 Times: వృద్ధుడ్ని కొట్టి 20సార్లు కత్తితో పొడిచిన కొడుకు

Stabbing

Stabbed 23 Times: ఉత్తరప్రదేశ్ లో కన్నతండ్రినే 23సార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన నమోదైంది. ఈ దాడిలో మృతి చెందిన వ్యక్తిని విజయ్ పాల్ చౌదరిగా గుర్తించారు. ఇద్దరు కొడుకులు, కోడలితో పాటు మీరట్ జిల్లాలోని దౌరలా ప్రాంతంలో ఉండేవాడు. సోమవారం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వచ్చిన పోలీసులకు కాలు పక్కన ఇంకో కాలు విడి భాగంలా పడి ఉండటం గమనించారు.

విచారణలో భాగంగా అతని కొడుకుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు చిన్న కొడుకే క్రైమ్ చేసినట్లుగా తెలిసింది. ‘ముందుగా అభిషాంత్ ఇంటికి కొందరు దొంగలు వచ్చారని.. ఆదివారం రాత్రి వారిని అడ్డుకునే క్రమంలో స్పృహ తప్పిపడిపోయానని చెప్పుకొచ్చాడు. లేచి చూసేసరికి అతని తండ్రి శరీరం రక్తపుమడుగులో పడి ఉండటం చూశా’నని చెప్పాడు.

రీసెంట్ గా మీరట్ లో ఉన్న స్థలం అమ్మి రూ.15లక్షలు తీసుకున్న చౌదరి వాటి నుంచి కొడుకులకు ఏ మాత్రం డబ్బు ఇవ్వలేదు. ఈ విషయంలోనే తండ్రికి ఇద్దరి కొడుకుల మధ్య గొడవ జరిగింది. అదే చిన్న కొడుకు చంపడానికి కారణమైంది కూడా..

ప్రాణం తీసిన సోఫా సొమ్ము:
మరో ఘటనలో 38ఏళ్ల వయస్సున్న వ్యక్తి తన భార్యతో గొడవపెట్టుకుని గొంతునులిమి చంపేసి ఆ తర్వాత రెండో అంతస్థు నుంచి కిందకు తోసేశాడు. లక్నోలో ఉండే వీరిద్దరి మధ్య సోఫా డబ్బుల గురించి వాదన మొదలైంది. అత్తారింటి పెట్టిన సోఫా మార్చి కొత్తది కొనుగోలు చేయాలనుకున్నాడు. దాని కోసం డబ్బులు పంపలేదని జరిగిన గొడవలో భార్యను హతమార్చాడు.