Force Gurkha: మహీంద్రా థార్కు పోటీగా మార్కెట్లోకి గూర్ఖా
ఎస్యూవీ సెగ్మెంట్లో మహీంద్రా థార్కు పోటీగా గూర్ఖా రిలీజ్ అవుతుంది. రాబోయే పండగ సీజన్లో ఎస్యూవీని మార్కెట్లో రిలీజ్ చేసేందుకు వీలుగా సన్నాహాలు జరుగుతున్నాయి.
Force Gurkha: ఎస్యూవీ సెగ్మెంట్లో మహీంద్రా థార్కు పోటీగా గూర్ఖా రిలీజ్ అవుతుంది. రాబోయే పండగ సీజన్లో ఎస్యూవీని మార్కెట్లో రిలీజ్ చేసేందుకు వీలుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే సోషల్ మీడియాలో టీజర్ వదిలారు. ఆఫ్రోడ్ రైడ్ని ఎంచుకునే వారి అభిరుచులకు తగ్గట్టుగా గూర్ఖా ఎస్యూవీని డిజైన్ చేసింది ఫోర్స్ సంస్థ.
ఏడాది ఆరంభంలో నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పోలో ఫోర్స్ సంస్థ గూర్ఖా వాహనాన్ని ప్రదర్శించింది. ప్రస్తుత సంవత్సరం మూడో క్వార్టర్లో వాహనాన్ని మార్కెట్లోకి తెస్తామని ప్రకటించింది కూడా. సెప్టెంబరు చివరి నాటికి ఫోర్స్ మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.
గూర్ఖా స్పెషాలిటీస్
– ఎల్ఈడీ డీఆర్ఎల్ హెడ్లైట్లను ఉపయోగించారు
– ఫోర్ వీల్ డ్రైవింగ్తో వచ్చే ఈ థార్ జీప్లో త్రీ డోర్, ఫోర్ డోర్ డిజైన్లు అందుబాటులో ఉంటాయి
– రెండో వరుసలో కూడా కెప్టెన్ సీట్లను అమర్చే అవకాశం ఉంది
– ఆఫ్రోడ్ ఎస్యూవీకి తగ్గట్టుగా గ్రిల్స్, క్రోమ్, బంపర్లను డిజైన్ చేశారు.
– ఆఫ్రోడ్ స్పెషాలిటీ అయిన టైయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ డిజైన్ను కొనసాగిస్తున్నారు
– గూర్ఖా పూర్తిగా రగ్గ్డ్ లుక్తో వస్తోంది.
బీఎస్ 4 ఇంజిన్ తో పాటు 2.2లీటర్ల ఆయిల్ బర్నర్ ను ఏర్పాటు చేశారు. స్టాండర్డ్ గా 5స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 2.6 లీటర్ల డీజిల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. 16 అంగుళాల అల్లోయ్ వీల్స్ ఉండి థిక్ ప్రొఫైల్ టైర్స్ తో కొత్తగా డిజైన్ చేశారు.