Mulugu : మాజీ సర్పంచ్ మృతదేహం పోస్టుమార్టంపై వివాదం..ఎవరీ రమేశ్

ములుగు జిల్లాలో చోటు చేసుకొన్న ఘటన మరోసారి మావోయిస్టుల ఉనికి రమేశ్ హత్యతో వెలుగు చూసింది.

Mulugu : మాజీ సర్పంచ్ మృతదేహం పోస్టుమార్టంపై వివాదం..ఎవరీ రమేశ్

Mulugu

Updated On : December 22, 2021 / 4:49 PM IST

Mulugu Former Sarpanch : మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మాజీ సర్పంచ్‌ రమేశ్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌పై వివాదం నెలకొంది. తమకు సంబంధం లేదని తెలంగాణ- ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రాల పోలీసులు అంటున్నారు. చర్లలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు రమేశ్‌ను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రెండు రాష్ట్రాల మధ్య పడేసి వెళ్లారు. అయితే మృతదేహానికి పోస్టుమార్టం చేయించే విషయంలో తమకు సంబంధం లేదంటూ ములుగు పోలీసులు, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు తప్పించుకుంటున్నారు. మావోయిస్టులు మీడియా ప్రతినిధులకు రమేశ్‌ మృతదేహాన్ని అప్పగించారు. వారు రమేశ్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే.. ఏ రాష్ట్రం వాళ్లు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించాలన్నదానిపై ఇప్పుడు గందరగోళం కొనసాగుతోంది.

Read More : AP Films : ఒక్క జిల్లాలో 15 థియేటర్లు సీజ్…సమావేశం కానున్న ఎగ్జిబిటర్లు

2014లో సర్పంచ్ : –
పోలీస్ ఇన్‌ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని రమేష్ మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లారు. కోర్సా రమేశ్‌ను రెండు రోజుల క్రితం రాత్రి వెంకటాపురం కె మండలం సూరువీడు పంచాయతీ కె కొండాపురం వద్ద కిడ్నాప్‌ చేశారు. రమేశ్‌ 2014లో సర్పంచ్‌గా గెలిచారు. ఆ తర్వాత రమేశ్‌ భార్య రజితకు ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రిలో ఏఎన్‌ఎం ఉద్యోగం వచ్చింది. దీంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్‌ సమీపంలో నివాసం ఉంటున్నారు. రమేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రమేశ్‌ గతంలో మావోయిస్టులకు కొరియర్‌గా పనిచేశాడు. అయితే.. అదే సమయంలో పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడని మావోయిస్టులు ఆయనపై ఆరోపణలు చేశారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు రమేశ్‌ బాధ్యుడని మావోయిస్టులు అనుమానం. అంతేకాదు ఓ మావోయిస్టు నేతకు విషాహారం పెట్టి అతని మరణానికి కారణమని మావోయిస్టులు ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయమై.. చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ప్రజాకోర్టు నిర్వహించి రమేశ్‌ చేసిన తప్పులను ఎత్తి చూపి ప్రజా కోర్టులో అతడిని మావోయిస్టులు హత్య చేశారు.

Read More : Kondapalli Twist: కొండపల్లి మున్సిపాలిటీ ట్విస్ట్.. బెంచ్ నుంచి తప్పుకున్న జడ్జ్

పట్టును పెంచుకొనేందుకు ప్రయత్నాలు : –
గతంలో కూడా ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రజా కోర్టులను నిర్వహించి రాజకీయ నేతలను, పోలీస్ ఇన్ ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో హత్యలు చేసిన ఘటనలున్నాయి. అయితే.. మావోయిస్టుల ఉనికి తగ్గిన నేపథ్యంలో ఈ తరహ ఘటనలు తగ్గాయి. చత్తీస్‌గడ్‌లో ఈ తరహ ఘటనలు సాగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఆ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో పట్టును పెంచుకొనేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది నుంచి మావోయిస్టులు రిక్రూట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ లు నిర్వహించే క్రమంలో ఎన్ కౌంటర్లు చోటు చేసుకొన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ కౌంటర్లు జరిగాయి. అయితే తాజాగా ములుగు జిల్లాలో చోటు చేసుకొన్న ఘటన మరోసారి మావోయిస్టుల ఉనికి రమేశ్ హత్యతో వెలుగు చూసింది.