Gujarat : కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రక్షాళన.. టీంలోకి కొత్తగా 200 మంది

సోష‌ల్ మీడియా టీం మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. దాదాపు 200 మంది కొత్త వారిని సోష‌ల్ మీడియా టీంలోకి తీసుకుంది. పార్టీ కార్యక్రమాలు, సిద్ధాంతంతో పాటు ఇర‌త కార్యక్రమాల‌ను...

Gujarat : కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రక్షాళన.. టీంలోకి కొత్తగా 200 మంది

Gujarath Congress

Gujarat Congress Social Media : ఈ యేడాది చివ‌ర్లో జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ స‌మాయ‌త్తమ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి కాస్త సీట్లు త‌గ్గడంతో.. కాంగ్రెస్ 77 సీట్లను సాధించుకుంది. బీజేపీపై ప్రజ‌ల్లో వ్యతిరేక‌త ఉంద‌ని, దీనిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని అధిష్ఠానం ప్రయ‌త్నాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటి నుంచే పార్టీ అనుబంధ విభాగాల‌ను బ‌లోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా మొద‌ట సోష‌ల్ మీడియా వింగ్‌పై గుజ‌రాత్ పీసీసీ దృష్టి పెట్టింది.

Read More : Aam Aadmi party : పంజాబ్ పీఠం దక్కింది..ఇక గుజరాత్ పై గురి పెట్టిన ‘ఆప్’

సోష‌ల్ మీడియా టీం మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. దాదాపు 200 మంది కొత్త వారిని సోష‌ల్ మీడియా టీంలోకి తీసుకుంది. పార్టీ కార్యక్రమాలు, సిద్ధాంతంతో పాటు ఇర‌త కార్యక్రమాల‌ను ఎప్పటిక‌ప్పుడు ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని కాంగ్రెస్ సూచించింది. 41 మంది అధ్యక్షులు, 15 మంది ఉపాధ్యక్షులు, 30 మంది ప్రధాన కార్యదర్శులు, 60 మంది ఆఫీస్ బేర‌ర్స్‌ను ఈ విభాగంలో నియ‌మించారు.

Read More : గుజరాత్ కాంగ్రెస్ వెబ్‌సైట్ హ్యాక్

అయితే.. ఈ 200 మందిని కేవ‌లం మెట్రో సిటీల నుంచి కాకుండా మండ‌లాలు, జిల్లాల నుంచి కూడా తీసుకున్నామ‌ని గుజ‌రాత్ పీసీసీ తెలిపింది. వ‌చ్చే సారి అధికార‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని సూచ‌న‌లు వ‌చ్చాయ‌ని, అందుకే మొద‌ట సోష‌ల్ మీడియా విభాగాన్ని పటిష్ఠ ప‌రుస్తున్నామ‌న్నారు. మ‌రి కొన్ని రోజుల్లో సోష‌ల్ మీడియాకు సంబంధించిన పెద్ద వ‌ర్క్‌షాప్‌ను నిర్వహించి, ట్రైనింగ్ ఇస్తామ‌ని కూడా పేర్కొన్నారు.