Prince Manvendra Singh : ‘గే’ ను వివాహం చేసుకున్న గుజరాత్ యువరాజు..!

గుజరాత్ కు చెందిన యువరాజు మన్వేంద్ర సింగ్ గోహిల్ స్వలింగ సంపర్కుడిని వివాహం చేసుకున్నారు.ఒహియోలోని కొలంబస్ చర్చిలో ఈ వివాహం జరిగింది.

Prince Manvendra Singh : ‘గే’ ను వివాహం చేసుకున్న గుజరాత్ యువరాజు..!

Prince Manvendra Singh Gohil Married With Gay (1)

Prince Manvendra Singh Gohil Married with Gay : రాజులు రాజ్యాలు పోయినా ఇంకా ఈనాటికి కూడా కొన్ని ప్రాంతాల్లో జమిందారలు రాజులుగా..వారి వారసులు యువరాజులు..యువరాణిలుగా కొనసాగుతున్నారు. సాధారణంగా రాజవంశాల్లో వివాహాలు అంటే అంగరంగ వైభోగంగా జరుగుతాయి. అలాగే గుజరాత్‌కు చెందిన ఓ యువరాజు వివాహం కూడా తాజాగా జరిగింది. కానీ ఈ యువరాజు వివాహం సంచలనంగా మారింది. ఎందుకంటే ఆ యువరాజు వివాహం చేసుకున్నది ఓ ‘గే’ని. ఎందుకంటే ఆ యువరాజు కూడా అటువంటివాడే కావటం గమనించాల్సిన విషయం.

గుజరాత్ కు చెందిన స్వలింగ సంపర్కుడైన యువరాజు మన్వేంద్ర సింగ్ గోహిల్ స్వలింగ సంపర్కుడిని వివాహం చేసుకున్నారు. జులై 6న (2022)ఒహియోలోని కొలంబస్ చర్చిలో ఈ ‘గే’వివాహం అత్యంత ఘనంగా జరిగింది. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న స్వలింగ సంపర్కుడైన డీఆండ్రీ రిచర్డ్‌సన్‌ను వివాహం చేసుకున్నానని మన్వేంద్ర సింగ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమ పెళ్లి ఫొటోలు, వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు మన్వేంద్ర సింగ్ గోహిల్.

మాజీ మహారాజు రఘువీర్ సింగ్ రాజేంద్రసింగ్-రాజ్‌పిప్లా రాచరిక రాష్ట్ర మాజీ రాణి రుక్మిణీ దేవి కుమారుడు యువరాజు మన్వేంద్ర సింగ్. ముంబైలోని స్కాట్స్ స్కూల్‌లో చదువుకున్న మన్వేంద్ర..ముంబై మిథిబాయి కాలేజీ క్యాంపస్‌లోని అమృత్‌బెన్ జీవన్‌లాల్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. గేను వివాహం చేసుకోకముందే మన్వేంద్ర ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. కానీ వారి వైవాహిక జీవితం ఏమాత్రం బాగాలేదు. మన్వేంద్ర ఎప్పుడు కుమిలిపోతుండేవారు. ఈక్రమంలో ఓ అమ్మాయి జీవితాన్ని నేను నాశనం చేశాను అంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు. తన వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా లేదని..ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశానంటూ పశ్చాత్తాపపడేవారు.

మన్వేంద్ర సింగ్ 2006లో స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. తనను తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. తద్వారా దేశంలోని రాజవంశంలో అలా ప్రకటించుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకెక్కారు. అప్పట్లో మన్వేంద్ర ప్రకటన తీవ్ర చర్చకు దారి తీసింది. 2018లో సుప్రీంకోర్టు సెక్షన్ 377ని రద్దు చేయడంతో రాజ్‌పిప్లాలో స్వలింగ సంపర్కుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేశారు. దానికి అమెరికన్ రచయిత జనేత్ పేరు పెట్టారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్వలింగ సంపర్కుల ఆశ్రమంగా ఇది రికార్డులకెక్కింది. మన్వేంద్ర 2007లో ప్రసిద్ధ అమెరికన్ షో ‘ఓఫ్రా విన్‌ఫ్రే’లో పాల్గొన్నారు. 2009లో బీబీసీ ‘అండర్ కవర్ ప్రిన్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009లో BBC “అండర్ కవర్ ప్రిన్స్” కార్యక్రమంలో..మన్వేంద్ర తన కొంతమంది స్నేహితులతో బంగ్లాలో చాలా రోజులు గడిపారు..రాజకుటుంబ జీవితంలోని అనేక అంశాలను వెల్లడించాడు.