Heroes on the Road: ఆ ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు హీరోలు.. కేంద్రమంత్రి గడ్కరీ చేతుల మీదుగా తొందరలో అవార్డులు

రోడ్డు ప్రమాదాల నివారణకు సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి డిపోలోనూ ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. ప్రతి ప్రమాదాన్ని లోతుగా అధ్యయనం చేసి, దానికి గల కారణాలు, నివారణ చర్యలను ఎప్పటికప్పుడు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు

Heroes on the Road: ఆ ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు హీరోలు.. కేంద్రమంత్రి గడ్కరీ చేతుల మీదుగా తొందరలో అవార్డులు

'Heroes on the Road' national awards for two TSRTC drivers

Heroes on the Road: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)కి రెండు జాతీయ అవార్డులు వరించాయి. రహదారి భద్రత కేటగిరీలో ఇద్దరు డ్రైవర్లకు ప్రతిష్ఠాత్మక ‘హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌’ పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌(ఏఎస్‌ఆర్టీయూ) శనివారం ప్రకటించింది. కుషాయిగూడ డిపోకు చెందిన కె. రంగారెడ్డి, సూర్యాపేటకు డిపోకు చెందిన కె. సోమిరెడ్డిలు అవార్డులకు ఎంపికయ్యారు. తమ సర్వీస్‌లో ప్రమాదరహితంగా విధులు నిర్వర్తించినందుకుగాను ఈ పురస్కారాలు వారికి లభించాయి. పట్టణ, గ్రామీణ విభాగాల్లో ఈ అవార్డులను ఏఎస్‌ఆర్టీయూ ప్రకటించింది. ఈ అవార్డులను కేంద్ర రోడ్డు, ట్రాన్స్‌పోర్ట్‌, హైవేస్‌ మంత్రి నితిన్‌ గడ్కరీ ఏప్రిల్‌ 18న న్యూఢిల్లీలో విజేతలకు అందజేస్తారు. అవార్డు వరించిన ఇద్దరు డ్రైవర్లు కె. రంగారెడ్డి, కె. సోమిరెడ్డిలకు సర్టిఫికేట్‌, నగదు పుర‌స్కారంతో పాటు ట్రోఫీలను అందజేసి సత్కరిస్తారు.

Kodali Nani : టీడీపీ పగ్గాలు జూ.ఎన్టీఆర్‌కి అప్పగించాలి, ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది-కొడాలి నాని

తమ సంస్థకు చెందిన ఇద్దరు డ్రైవర్లకు ‘హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌’ పురస్కారాలు లభించడంపై టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికైన కె. రంగారెడ్డి, కె. సోమిరెడ్డిలను ఈ సందర్బంగా అభినందించారు. ఈ పురస్కారాలు టీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠను మరింతగా ఇనుమడింపజేశాయన్నారు. సంస్థలోని మిగతా డ్రైవర్లు కూడా వీరి సేవ‌ల్నిస్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం డ్రైవింగ్ ఒక సవాల్ గా మారిందని, జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. రోడ్డుపై ప్రయాణించే తోటి వాహనదారుల, పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటిస్తూ.. ప్రమాదాల నివారణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి డిపోలోనూ ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. ప్రతి ప్రమాదాన్ని లోతుగా అధ్యయనం చేసి, దానికి గల కారణాలు, నివారణ చర్యలను ఎప్పటికప్పుడు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా, రాష్ట్రంలోని అద్దె బస్సు డ్రైవర్లందరికీ వారం రోజుల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చామని వివరించారు. రాబోయే రోజుల్లో రహదారి భద్రతపైన వినూత్నమైన కార్యక్రమాలను తీసుకురావడం జరుగుతుందని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.