High Court : బిగ్‌బాస్‌ లాంటి అభ్యంతరకర షోలు సమాజానికి ప్రమాదకరం

అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేలాగా బిగ్‌బాస్‌ షో ఉందని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. తాజాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది..............

High Court : బిగ్‌బాస్‌ లాంటి అభ్యంతరకర షోలు సమాజానికి ప్రమాదకరం

Biggboss

BiggBoss :  తెలుగులో ఇప్పటికే అయిదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరో సీజన్ ని ఓటీటీలో టెలికాస్ట్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది బిగ్‌బాస్‌. బిగ్‌బాస్‌ హౌస్ లో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఒక 100 రోజులు ఉంటూ నిర్వాహకులు ఇచ్చే టాస్కులని ఆడుతూ ఉంటారు. అయితే ఈ షోపై గతంలోనూ చాలా అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఈ షోని ఆపేయ్యాలంటూ చాలా మంది ప్రముఖులు మాట్లాడారు కూడా. బిగ్‌బాస్‌ లో కొన్ని టాస్కులు శృతి మించి ఉండటమే కాకుండా, కంటెస్టెంట్స్ మధ్య ముద్దులు, కౌగలింతలు, ఒకరి మీద ఒకరు పడుకోవడం, కూర్చోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి. షో రేటింగ్ కోసం ఇలాంటి వాటినే ఎక్కువగా చూపిస్తున్నారు. ఇవన్నీ గత సీజన్ల నుంచి జరుగుతూనే వస్తున్నాయి. వీటివల్ల సమాజం చెడిపోతుందని, యువత తప్పుదారి పడుతుందని గతంలో పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.

అయితే అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేలాగా బిగ్‌బాస్‌ షో ఉందని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. తాజాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి.. బిగ్‌బాస్‌ షో వల్ల యువత తప్పుదోవ పడుతోందని, ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని శుక్రవారం హైకోర్టు ముందు ప్రస్తావించారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ.. ”మంచి వ్యాజ్యం వేశారు. ఇన్ని రోజులు ఎవరూ ఎందుకు స్పందించలేదని అనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అశ్లీలతను పెంచుతున్నాయి. బిగ్‌బాస్‌ లాంటి రియాల్టీ షోలతో యువత పెడదారిపడుతోంది. ఇలాంటి షోలు సమాజానికి ప్రమాదకరం. తమ పిల్లలు బాగున్నారు, ఇలాంటి షోలతో మనకేం పని అని ప్రజలు భావిస్తున్నారు. సమాజంలోని ఇతరుల గురించి పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఏదైనా సమస్య మనకు ఎదురైనప్పుడు ఇతరులు పట్టించుకోరు. ఇలాంటి అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని” వ్యాఖ్యానించింది.

Chiranjeevi : చిరంజీవి గారు పిలిచారు.. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్.. ‘ఆచార్య’తో రోజా మీటింగ్..

బిగ్‌బాస్‌ షోను నిలిపేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సోమవారం విచారణ చేస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. దీంతో సోమవారం దీనిపై విచారణ జరగనుంది. మరి బిగ్‌బాస్‌ ఆగిపోనుందా?? లేదా?? హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.