Jana Gana Mana: విజయ్ జనగణమన.. పవన్-మహేష్ ఎందుకు వద్దనుకున్నారు?

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లైగర్ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది ఆగస్టు 25న ఈ సినిమా..

Jana Gana Mana: విజయ్ జనగణమన.. పవన్-మహేష్ ఎందుకు వద్దనుకున్నారు?

Jana Gana Mana

Jana Gana Mana: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లైగర్ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాగా జనగణమన మొదలైంది. మంగళవారం ముంబైలో లాంఛనంగా ప్రారంభైన ఈ సినిమా ఆర్మీ నేపథ్యంలో ఉంటుందని ఈ చిత్ర టైటిల్ పోస్టర్ చూస్తే మనకు అర్థం అవుతుంది. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ మేజర్‌గా మనకు కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Jana Gana Mana: పూరీ-విజయ్ రెండో పాన్ ఇండియా సినిమా లాంచింగ్!

అయితే.. నిజానికి పూరీ జగన్నాధ్ ఈ సినిమాను ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలని అనుకున్నాడు. మహేష్-పూరీ కాంబినేషన్ లో వచ్చి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్టైన పోకిరి విడుదల తేదీ రోజునే ఏప్రిల్ 28న 2016లో పూరీ సినిమాను అనౌన్స్ కూడా చేశారు. ‘పోకిరి’ని మించి క్రూరంగా, ‘బిజినెస్ మ్యాన్’ను మించి పవర్ ఫుల్ గా ఇందులో మహేశ్ బాబు క్యారెక్టర్ ఉంటుందని పూరి జగన్నాథ్‌ ఆ టైమ్ లో చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది.

Jana Gana Mana: ముహూర్తం పెట్టేసిన పూరీ-రౌడీ.. గ్యాప్ లేకుండా కుమ్ముడే!

ఆ తరువాత జనగణమన సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించనున్నాడని ప్రచారం జరిగింది. ఆ మేరకు పవన్ కూడా సిద్ధమయ్యాడని చెప్పుకున్నారు. కానీ అది కూడా సెట్ కాలేదు. ఆ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ తో ఈ సినిమా ఉండబోతుందని కూడా ప్రచారం జరిగింది. కానీ అది కూడా పట్టాలెక్కలేదు. అయితే.. జనగణమన సినిమా మాత్రం ఉంటుందని పూరీ చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకసారి మహేష్ కూడా పూరితో సినిమా చేయాలని ఉందని.. కథ నేరేట్ చేస్తాడని వెయిట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Jana Gana Mana: రౌడీతో పూరీ ర్యాపో.. అప్పుడే సెట్స్‌పైకి జనగణమన!

మహేష్-పవన్ తో ఏమైందో కానీ.. పూరీ ఫైనల్ గా రౌడీ హీరోతో సినిమా మొదలు పెట్టేశాడు. లైగర్ సినిమా షూటింగ్ లో విజయ్-పూరీ మధ్య బాండింగ్ అది పూర్తవగానే మరో సినిమాను కూడా కంటిన్యూ చేసేలా మార్చేసింది. విజయ్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆయన ప్రస్తుతం పుష్ప 2 పనిలో ఉన్నాడు. అందుకే ఈలోగా ఫటా ఫట్ పూరీ జనగణమన పూర్తి చేసే పనిలో పడ్డాడు. అయితే.. అప్పుడు అసలు మహేష్-పవన్ ఈ సినిమాను ఎందుకు వద్దనుకున్నారన్నది ఆసక్తి మారింది. ఇప్పుడు మాత్రం విజయ్ పూరీ మధ్య దోస్తీనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలా చేసినట్లుగా కనిపిస్తుంది.