Janhvi kapoor : కనీసం వాళ్ళు చూసినా నా సినిమా హిట్ అయ్యేది..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మిలీ సినిమా రిజల్ట్ పై, తన సోషల్ మీడియా గురించి మాట్లాడింది జాన్వీ కపూర్. గతంలో తను ఎక్కువగా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పెట్టడానికి కారణం డబ్బులు వస్తాయని, ఫాలోవర్లు పెరుగుతారని

Janhvi kapoor : కనీసం వాళ్ళు చూసినా నా సినిమా హిట్ అయ్యేది..

Janhvi kapoor comments on social media popularity

Janhvi kapoor :  బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురి జాన్వీ కపూర్ తన సినిమాల కంటే కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ మరింత పాపులర్ అయింది. కమర్షియల్ సినిమాలకి స్కోప్ ఉన్నా కూడా ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుంది జాన్వీ. ఇటీవల మిలీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మలయాళం సినిమా హెలెన్ కి రీమేక్ గా తెరకెక్కింది మిలీ.

అయితే మిలీ సినిమా అంతగా విజయం సాధించలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మిలీ సినిమా రిజల్ట్ పై, తన సోషల్ మీడియా గురించి మాట్లాడింది జాన్వీ కపూర్. గతంలో తను ఎక్కువగా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పెట్టడానికి కారణం డబ్బులు వస్తాయని, ఫాలోవర్లు పెరుగుతారని తెలిపింది.

Sreeleela : స్పెయిన్‌లో షూటింగ్‌కి వెళ్లి.. బ్యాగ్ పోగొట్టుకున్న హీరోయిన్

తాజాగా జాన్వీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక నటికి, సోషల్ మీడియా పాపులారిటీకి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ నిజంగా ఆ రెండిటికి సంబంధం ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల‌ మంది నన్ను ఫాలో అవుతున్నారు. నా మిలీ సినిమాని కేవలం వాళ్ళు చూసినా చాలు హిట్ అయ్యేది, కానీ చూడలేదు కదా. యాక్టర్స్ కి స్టార్ డమ్ ఉండొచ్చు కానీ అది సోషల్ మీడియాతో రాదు. సినిమా సెలబ్రిటీకి, సోషల్ మీడియా పాపులారిటీకి సంబంధం లేదు అని తెలిపింది.