Jeevitha Rajashekar : నేనెవరినీ మోసం చేయలేదు.. నా సినిమాకి టికెట్ రేట్లు కూడా పెంచను..

శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకురాలు జీవితరాజశేఖర్ మాట్లాడుతూ.. ''నేను అందరిలాగే సాధారణమైన మనిషినే. నాకు ఊహ తెలిసినప్పటినుంది నేను లైఫ్ తో ఫైటింగ్ చేస్తున్నాను. నేను ఎవరినీ, ఎప్పుడూ...........

Jeevitha Rajashekar : నేనెవరినీ మోసం చేయలేదు.. నా సినిమాకి టికెట్ రేట్లు కూడా పెంచను..

Jeevitha

Jeevitha Rajashekar :  రాజశేఖర్ హీరోగా, శివాని ముఖ్యపాత్రలో తెరకెక్కిన సినిమా శేఖర్. మలయాళం సూపర్ హిట్ సినిమా ‘జోసెఫ్’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని జీవితా రాజశేఖర్ తెరకెక్కించారు. శేఖర్ సినిమా మే 20న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి శేఖర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డైరెక్టర్ సుకుమార్ విచ్చేశారు.

 

శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకురాలు జీవితరాజశేఖర్ మాట్లాడుతూ.. ”నేను అందరిలాగే సాధారణమైన మనిషినే. నాకు ఊహ తెలిసినప్పటినుంది నేను లైఫ్ తో ఫైటింగ్ చేస్తున్నాను. నేను ఎవరినీ, ఎప్పుడూ మోసం చేయలేదు. నాకు చేతనైన సహాయం చేశాను. అలాగే నాకు కూడా చాలా మంది హెల్ప్ చేశారు. నేను అడిగిన వెంటనే ఇక్కడ ఉన్న చాలా మంది ఎంతో బిజీగా ఉన్నా ఈ ఫంక్షన్ కు వచ్చి స్టేజ్ మీద మాట్లాడిన మాటలు మాకెంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇలా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటే ఈ ప్రపంచంలో అందరూ బాగుంటాము.”

Rajashekar : డెత్ బెడ్ నుంచి తిరిగొచ్చి సినిమా చేశాను.. మీ ఆశీర్వాదం వల్లే బతికి ఉన్నా.. సినిమాని కూడా బతికించండి..

”కోవిడ్ తర్వాత చాలా మంది థియేటర్ కు రావడం లేదు, ఓటిటిలోనే చూస్తారు అని చెప్పారు. ఈ సినిమా చాలా మంచి సినిమా. ఇప్పటివరకు మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను కూడా ఆదరించండి. టికెట్ రేట్స్ పెరగడం వలన కొంతమంది ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదని విన్నాను. మా సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం లేదు. గవర్నమెంట్ పెట్టిన రేట్లకే మా సినిమాను ప్రదర్శిస్తున్నాము. మా సినిమా రిలీజ్ చేస్తున్న ప్రతి బయ్యర్స్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా అదే చెప్పాము. దయచేసి అందరూ మే 20న థియేటర్స్ కు వచ్చి మా సినిమాను సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని తెలిపారు.