Madhya Pradesh : ‘బీజేపీలో చేరండి లేకుంటే బుల్డోజర్లు రెడీ ఉన్నాయ్’ : కాంగ్రెస్ నేతలకు బీజేపీ మంత్రి హెచ్చరిక

బీజేపీలో చేరండి.. లేదంటే బుల్డోజర్ సిద్దంగా ఉంది అంటూ కాంగ్రెస్ నేతలను మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా హెచ్చరించారు.

Madhya Pradesh : ‘బీజేపీలో చేరండి లేకుంటే  బుల్డోజర్లు రెడీ ఉన్నాయ్’ : కాంగ్రెస్ నేతలకు బీజేపీ మంత్రి హెచ్చరిక

"Join BJP or bulldozer is ready..."MP minister worn Cong leaders

Madhya Pradesh : బీజేపీలో చేరండి.. లేదంటే బుల్డోజర్ సిద్దంగా ఉంది అంటూ కాంగ్రెస్ నేతలను మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా హెచ్చరించారు. బుధవారం (జనవరి 18,2023) రఘోగర్‌నగర్‌ స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ..రుతియాయ్ సిటీలో జరిగిన బహిరంగ సభలో మధ్యప్రదేశ్ పంచాయతీ మంత్రి హేంద్ర సింగ్ సిసోడియా మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది వచ్చి తీరుతుందని..కాబట్టి అందరూ బీజేపీలో చేరాలని.., బీజేపీలో చేరకపోతే బుల్డోజర్‌ సిద్ధంగా ఉంది అంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేతలకు హెచ్చరించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

2023లో కూడా మధ్యప్రదేశ్ లో బీజేపీయే అధికారంలోకి వస్తుందని మెల్లగా బీజేపీలో చేరండి లేదంటే బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయంటూ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారని కౌంటరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

కాగా..బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నేరాలకు పాల్పడుతున్న వారి ఇళ్లను బుల్డొజర్లతో కూల్చివేస్తున్నామని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటుంటారు.బుల్డొజర్‌ను ఆ పార్టీ బూచిగా చూపిస్తూ ప్రశ్నించే వారిని వేధిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఇదే బుల్డోజర్ బెదిరింపులకు దిగారనే విమర్శళు బీజేపీపై ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఈ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.

కాగా తెలంగాణలో కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బుల్డోజర్ల వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి ఓటు వేయనివారి ఇంటికి బుల్డోజర్లు వస్తాయని మీ ఇళ్లను బుల్డోజర్లతో తొక్కించేస్తాం అంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇలా ఎన్నికలు వచ్చాయంటే బీజేపీ బుల్డోజర్ల వ్యాఖ్యలతో వివాదాలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో రఘోగర్‌నగర్‌ స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ..రుతియాయ్ సిటీలో జరిగిన బహిరంగ సభలో మధ్యప్రదేశ్ పంచాయతీ మంత్రి హేంద్ర సింగ్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు మరోసారి బీజేపీ బుల్డోజర్ల రాజకీయాలను బహిర్గం చేసినట్లు అయ్యింది.