K Viswanath Wife passed away : కె విశ్వనాథ్ సతీమణి కన్నుమూత..
టాలీవుడ్ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్.. ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూశారు. వయోభారంతో బాధ పడుతున్న విశ్వనాథ్ ఫిబ్రవరి 2న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
K Viswanath Wife passed away : టాలీవుడ్ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్.. ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూశారు. వయోభారంతో బాధ పడుతున్న విశ్వనాథ్ ఫిబ్రవరి 2న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయింది. కళామతల్లికి విశేషమైన సేవలు అందించి కళాతపస్విగా పేరు సంపాదించుకున్నారు. ఫిబ్రవరి 3న కె విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. కాగా ఆ రోజు విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి అనారోగ్యం పాలైంది.
K Viswanath : కళాతపస్వికి కడసారి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు..
కళాతపస్వి మరణాన్ని తట్టుకోలేక ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె అస్వస్థతకు గురైన సంగతి తెలుసుకున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఆ రోజునే ఆమెను కలిసి, ఆమెకు ధైర్యం చెప్పారు. కానీ భర్త మరణాన్ని జీర్ణించుకోలేక పోయిన జయలక్ష్మి.. అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూ వస్తున్నారు. ఈరోజు (ఫిబ్రవరి 26) గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే ఆయన సతీమణి కూడా కన్నుమూయడంతో విశ్వనాథ్ కుటుంబంలో తీరని విషాదాన్ని కలిగిస్తుంది.
కాగా రేపు అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. కె విశ్వనాథ్ అంత్యక్రియలు కూడా పంజాగుట్ట శ్మశానవాటికలోనే జరిగాయి. ఇక ఆమె మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులు ఆమె మరణానికి చింతిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.