Lock Upp : షారుఖ్, ప్రియాంక, రణవీర్ వీళ్లంతా ఫెయిల్.. మరోసారి బాలీవుడ్ మాఫియా అంటూ కంగనా వ్యాఖ్యలు..
కంగనా ప్రతి సారి బాలీవుడ్ మాఫియా అంటూ కొంతమంది బాలీవుడ్ స్టార్లని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. తాజాగా లాకప్ షో మంచి హిట్ అవ్వడంతో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బాలీవుడ్......
Kangana Ranaut : బాలీవుడ్ క్వీన్, ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. ఏ అంశంపైనైనా, ఎవరిపైనైనా భయం లేకుండా మాట్లాడుతుంది. ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇటీవల హోస్ట్ గా మారింది. కంగనా రియాలిటీ షో ‘లాకప్’కు హోస్ట్గా వ్యవహరిస్తోంది. ఈ షో కూడా కాంట్రవర్సీగానే ఉంటుంది. ఓటిటిలో టెలికాస్ట్ అయ్యే ఈ షోకి కూడా జనాదరణ బాగా వచ్చింది. రోజు రోజుకి ‘లాకప్’ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవలే ఈ షో 200 మిలియన్ వ్యూస్ సాధించి కొత్త రికార్డు సృష్టించింది. దీంతో కంగనా రనౌత్ చాలా ఆనందిస్తుంది.
ఈ ఆనందంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. కంగనా ప్రతి సారి బాలీవుడ్ మాఫియా అంటూ కొంతమంది బాలీవుడ్ స్టార్లని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. తాజాగా లాకప్ షో మంచి హిట్ అవ్వడంతో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బాలీవుడ్ స్టార్స్ ని ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో.. ”బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, రణ్వీర్ సింగ్ లాంటి చాలా మంది స్టార్లు నటనలో విజయవంతమయ్యారు. కానీ హోస్ట్గా మాత్రం పూర్తిగా ఫెయిలయ్యారు. వాళ్లంతా ఫెయిల్యూర్ హోస్ట్స్. ఒక అమితాబ్ బచ్చన్ జీ, సల్మాన్ ఖాన్ జీ, కంగనా రనౌత్ మాత్రమే హోస్ట్గా కూడా సక్సెస్ అయ్యారు. ఇలా సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉంది” అని తెలిపింది.
Yashoda : విడాకుల తర్వాత సమంత హీరోయిన్గా ఫస్ట్ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్
అంతేకాకుండా ఈ పోస్ట్ లో.. ”నేను సక్సెస్ అవ్వడం చూసి అసూయ పడే ఈ సినిమా మాఫియా వాళ్ళు నన్ను, నా షోను అప్రతిష్ట పాలు చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ అది వారివల్ల కాదు. ఎందుకంటే నన్ను, నా షోను నేను రక్షించుకుంటాను. అలాగే నేను ఇతరులకోసం నిలబడితేనే నాకోసం నేను నిలబడగలను. ఈతరం జనరేషన్లో హోస్ట్గా నేను మాత్రమే విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. మరి వీటిమీద ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.