Ramesh varma : స్టేజిపైనే హీరోయిన్కి సారీ చెప్పిన ఖిలాడీ డైరెక్టర్
రమేష్ వర్మ సినిమా గురించి మాట్లాడిన తర్వాత మీనాక్షిని ఉద్దేశించి... ''ఖిలాడీ ట్రైలర్ తో పాటు ఇతర ప్రమోషన్స్లోనూ డింపుల్ హాయతినే కాస్త ఎక్కువగా చూపించాము. ఇది కావాలని చేయలేదు....
Meenakshi Chaudhary : మాస్ మహారాజా రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి లు హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘ఖిలాడీ’. రమేశ్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న అంటే ఈ రోజు విడుదల అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులని ఉర్రూతలూగించాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో డైరెక్టర్ రమేశ్ వర్మ స్టేజ్పైనే హీరోయిన్ మీనాక్షి చైదరికి క్షమాపణలు చెప్పారు.
Mahesh Babu : మహేష్కి తల్లిగా సీనియర్ హీరోయిన్
రమేష్ వర్మ సినిమా గురించి మాట్లాడిన తర్వాత మీనాక్షిని ఉద్దేశించి… ”ఖిలాడీ ట్రైలర్ తో పాటు ఇతర ప్రమోషన్స్లోనూ డింపుల్ హాయతినే కాస్త ఎక్కువగా చూపించాము. ఇది కావాలని చేయలేదు. సినిమా ప్రమోషన్ లో అది భాగమైంది. మీనాక్షి ఈ విషయంలో ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు ఇద్దరూ హీరోయిన్సే. సినిమా చూశాక నువ్వు చాలా సంతోషిస్తావు. ఎందుకంటే సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధన్యత ఉంటుంది. ఇద్దరూ సమానమే సినిమాకి” అని తెలిపారు.